27-09-2025 08:05:39 PM
జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్..
కామారెడ్డి (విజయక్రాంతి): జిల్లా కేంద్రంలోని సిఎస్ఐ చర్చి ఎదురుగా గల కొండా లక్ష్మణ్ బాపూజీ విగ్రహనికి బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో శనివారం ఆయన జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ కొండా లక్ష్మణ్ బాపూజీ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, కొండ లక్మణ్ బాపూజీ నిజాం నిరంకుశ విధానానికి వ్యతిరేకంగా ఉద్యమించిన మహనీయ నేత అని అన్నారు. తెలంగాణ తొలి, మలిదశ ఉద్యమంలో చురుగ్గా పాల్గొని తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర సాధనలో ముఖ్య భూమిక పోషించారని అని ముఖ్య భూమిక పోషించారని అన్నారు.
ఈ కార్యక్రమంలో జిల్లా బీసీ అభివృద్ధి అధికారి జయరాజ్, సహాయ బీసీ అభివృద్ధి అధికారి చక్రధర్, బహుజన సంఘాల నాయకులు కొత్తపల్లి మల్లయ్య, రాజయ్య, నాగరాజు, ఆజాద్, వినోద్, పవన్, జీవన్, శాంతయ్య, నరేష్, టీఎన్జీవోస్ జిల్లా అధ్యక్షులు వెంకటరెడ్డి, కార్యదర్శి నాగరాజు, బీసీ సంఘం నాయకులు, పద్మశాలి సంఘం నాయకులు షేర్ల రాములు, లక్మి నర్సింలు, చాట్ల రాజేశ్వర్, సబ్బాని హరి, అవధూత నరేందర్ జిల్లా అధికారులు, పలువురు ప్రభుత్వ ఉద్యోగులు పాల్గొన్నారు.