calender_icon.png 22 August, 2025 | 8:59 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కాంగ్రెస్ ప్రజా పాలనలో పేద ప్రజల అభివృద్ధి

22-08-2025 06:11:13 PM

తుంగతుర్తి 1400 కోట్ల నిధులతో అభివృద్ధికి కృషి

తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేలు

తుంగతుర్తి,(విజయక్రాంతి): కాంగ్రెస్ ప్రజా పాలనలోనే పేద ప్రజల అభ్యున్నతి ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి తో కొనసాగుతుందని తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేలు అన్నారు. శుక్రవారం మండల పరిధిలోని బండ రామారం గ్రామంలో 15 లక్షల వ్యయంతో నిర్మించిన సిసి రోడ్ నిర్మాణ పనులకు ప్రారంభించారు. 10 లక్షల వ్యయంతో అంగన్వాడి కేంద్రం, గ్రామపంచాయతీ నూతన భవనం, తుంగతుర్తిలో నూతన ఎస్టీవో భవనాన్ని ప్రారంభించి పేదల కోసం పంపిణీ చేసిన ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలకు  శంకుస్థాపన కార్యక్రమాన్ని నిర్వహించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మందుల సామేలు మాట్లాడుతూ... గడిచిన 18 నెలల్లో తుంగతుర్తి నియోజకవర్గంలో సుమారు 1400 కోట్ల పైచిలుకు అభివృద్ధి పనులు కొనసాగినట్లు పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికలు ఇచ్చిన హామీ మేరకు ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి రుణమాఫీ, రైతు భరోసా, రైతు బీమా, మా లక్ష్మి పథకం, కళ్యాణ లక్ష్మి, ఉచిత రేషన్ కార్డు, నియోజకవర్గంలో సుమారు 3500 పై చిలుకు ఇందిరమ్మ ఇల్లు పంపిణీకి శ్రీకారం చుట్టి ఒక ఇంటికి ఐదు లక్షలు చొప్పున ఖర్చు చేసి, పేదలకు ఇల్లు ఇస్తున్న ఘనత కాంగ్రెస్ పార్టీ దానిని అన్నారు. ఒక్క బండ రామాను గ్రామాలే న4 కోట్ల పై చిలుకు అభివృద్ధి పనులు చేసినట్టు తెలిపారు.

ప్రస్తుతం 20 మంది పేదలకు గ్రామంలో ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేసినట్టు రానున్న రోజుల్లో దళితుల కోసం ఎస్సీ కమ్యూనిటీ హాల్, డబల్ రోడ్డు, ఆర్టీసీ బస్సు సౌకర్యం కల్పిస్తానని హామీ ఇచ్చారు. ఓ రైతు ఎస్సారెస్పీ జలాలు వస్తాయని అడగగా, తక్షణమే సంబంధిత ఎస్. ఈ తో ఫోన్లో మాట్లాడి, పది రోజుల్లో ఎస్సారెస్పీ జలాలు వచ్చే విధంగా కృషి చేస్తానని అన్నారు. అనంతరం జిల్లా కాంగ్రెస్ పార్టీ యువ నాయకులు రేగటి రవి గౌడ్ మాట్లాడుతూ... గ్రామంలోని ప్రజలకు ఎల్లవేళలా అందుబాటులో ఉంటానని రానున్న స్థానిక సంస్థ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం కృషి చేయాలని కోరారు.