22-08-2025 07:33:45 PM
బాన్సువాడ,(విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా బీర్కూర్ మండలంలో పనుల జాతర కార్యక్రమం రాష్ట్ర ఆగ్రో కార్పొరేషన్ చైర్మన్ కాసుల బాలరాజు ప్రారంభించారు. మండలంలోని విరాపూర్, స్తంభపూర్, బీర్కూర్ తండాలలో నూతనంగా నిర్మించే. అంగన్ వాడి కేంద్రాలు, గ్రామ పంచాయతీ భవన నిర్మాణ పనులను శుక్రవారం రాష్ట్ర ఆగ్రో ఇండస్ట్రీస్ కార్పొరేషన్ చైర్మన్ కాసుల బాలరాజ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రత్యేక దృష్టితో గ్రామాలలో మౌలిక సదుపాయాలు కల్పించడం జరుగుతుందని అన్నారు.ప్రజలకు సంక్షేమ పథకాలు సకాలంలో అందిస్తూ ప్రజల మన్ననలు పొందుతుందన్నారు.