17 April, 2026 | 2:30 PM

Breaking News

తేజస్వీ సూర్య వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన మాజీ ఎంపీ నామ   •   కాళేశ్వరంలో జరిగిన పొరపాట్లు.. తెలంగాణ ప్రజలకు తెలుసు   •   ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి తంగళ్ళపల్లిలో వినతి పత్రాల కార్యక్రమం   •   25 క్వింటాళ్ల రేషన్ బియ్యం సీజ్   •   హుజూర్ నగర్ సీనియర్ సివిల్ జడ్జిగా శ్యామ సుందర్   •   విద్యార్థిని మృతి... ప్రభుత్వంపై తెలంగాణ బీసీ సంక్షేమ సంఘంతీవ్ర విమర్శలు   •   మాణిక్ గూడ గ్రామ సంరక్షణకు చర్యలు   •   సేవ చేయాలనే సంకల్పంతోనే రాజకీయాల్లోకి   •   వేములవాడ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో సర్వర్ డౌన్.. నిలిచిపోయిన రిజిస్ట్రేషన్లు   •   శ్రీ భీమేశ్వర స్వామి సేవలో ఐజీపీ రమేష్ నాయుడు   •  

కాలేశ్వరం కు పోటెత్తిన భక్తులు

24-05-2025 01:44 PM

మహదేవపూర్,(విజయక్రాంతి): సరస్వతి పుష్కరాల్లో(Saraswati Pushkaralu) భాగంగా 10వ రోజున భక్తులతో కిటికీట లాడుతున్న కాలేశ్వరం. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మంగా నిర్వహిస్తున్న సరస్వతీ పుష్కరాలలో భాగంగా పదవ రోజున భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. పుష్కర భక్తులు ఉదయం నుండి సరస్వతి పుష్కర ఘాట్ వద్ద స్నానాలు ఆచరించి శ్రీ కాళేశ్వర ముక్తేశ్వర స్వామి దర్శించుకున్నారు. పాలకుర్తి ఎమ్మెల్యే యశస్విని రెడ్డి(Palakurthi MLA Yashaswini Reddy) తన కుటుంబ సభ్యులతో పుష్కర ఘాట్ లో స్నానవాచరించి స్వామివారిని దర్శించుకుని అభిషేకము పూజలు చేశారు.

శివ భక్తులైన (థర్డ్ జెండర్స్) పదవరోజున ఎక్కువ మంది పాల్గొని పుష్కర స్నానం ఆచరించి ఆ శివుని దర్శించుకున్నారు. భక్తులతో కాలేశ్వరం ఎటు చూసినా మినీ కుంభమేళను తలపిస్తుంది. వీకెండ్ కావడంతో ఇంకా ఎక్కువ భక్తులు వచ్చే అవకాశం ఉన్నందున వర్షం పడి నీళ్ళు నిలిచిన ప్రాంతంలో చిప్స్ వేస్తూ జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ, జిల్లా ఎస్పీ కిరణ్ కరే ఆధ్వర్యంలో పరివేక్షణ ఏర్పాట్లు చేస్తున్నారు. ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా పోలీస్ ఇతర శాఖల సమన్వయంతో పుష్కర ఘాట్ లో గాని పార్కింగ్ స్థలాల్లో గాని ఆలయంలో గాని భక్తుల రద్దీని సమన్వయం చేస్తూ భక్తులకు సకల సౌకర్యాలు అందే విధంగా కృషి చేస్తున్నారు.