30 June, 2026 | 10:07 PM

Breaking News

పెంచికల్‌పేట్ పోలీస్ స్టేషన్‌ను తనిఖీ చేసిన ఎస్పీ   •   మండల అధ్యక్షులుగా అంకం శ్రీనివాస్   •   రాంకీ డంపింగ్ యార్డ్ తొలగింపే లక్ష్యం   •   రాష్ట్రంలో ఎక్కడ చూసినా కులవివక్షత కొనసాగుతుంది   •   ఉపాధ్యాయులు, ఎస్‌ఎస్‌ఏ సిబ్బంది సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి   •   ఓటరు ఎన్యూమరేషన్ (SIR )పారాలు బిఎల్ఓ యాప్ లో నమోదు చేయాలి   •   దుండిగల్ వార్డులో సీఎంసీ కమిషనర్ శ్రీజన ఐఎఎస్ పర్యటన   •   అక్కంపల్లి గ్రామంలో హరితవనాలు, ఫిట్టింగ్ పనులు పరిశీలించిన డిఆర్డిఓ కుటుంబరావు   •   హనుమాన్ ఆలయంలో చోరీ   •   డీడీఎన్ అర్చక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులుగా బసవలింగప్ప ఎన్నిక   •  

నేర్చుకున్న అంశాలను తరగతి గదిలో బోధించాలి

24-05-2025 08:07 PM

నిర్మల్ (విజయక్రాంతి): ఉపాధ్యాయులకు నిర్వహించిన శిక్షణ తరగతులు, నేర్చుకున్న అంశాలను తరగతి గదిలో బోధన పద్ధతుల్లో అమలు చేయాలని జిల్లా విద్యాశాఖ అధికారి రామారావు(District Education Officer Rama Rao) అన్నారు. జిల విజయ ఉన్నత పాఠశాలలో వ్యాయామ ఉపాధ్యాయులకు ఐదు రోజులుగా నిర్వహిస్తున్న శిక్షణ శిబిరం ముగింపు సమావేశంలో శనివారం పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... శిక్షణలో నేర్చుకున్న విషయాలను పాఠశాలలో అమలు చేయాలని, విద్యార్థులను శారీరకంగా, మానసికంగానూ సంసిద్ధులను చేసి వారిలో క్రీడా నైపుణ్యాలను వెలికి తీయాలని, విద్యా ప్రగతికి దోహదపడాలని సూచించారు.

ఇటువంటి శిక్షణలు ఇంకా ఇవ్వబడతాయని, ఉపాధ్యాయులు వీటిని వినియోగించుకొని భవిష్యత్తులో విద్యార్థులకు చక్కటి అవకాశాలు కల్పించాలని కోరారు. ఐదు రోజులుగా శిక్షణ ఇస్తున్న డిఆర్పీలు ఎం శ్రీనివాస్ వి భూమన్న జమున అన్నపూర్ణలను శాలువాలతో సత్కరించారు. వ్యాయమ ఉపాధ్యాయులతో కలిసి గ్రూప్ ఫోటో దిగారు. ఈ కార్యక్రమంలో కోర్సు బాధ్యులు యన్ ప్రవీణ్ కుమార్, డిఆర్పిలు, వ్యాయామ ఉపాధ్యాయులు పాల్గొన్నారు.