17 April, 2026 | 9:37 PM

Breaking News

అంధకారంలో వనదుర్గమ్మ భక్తులు   •   జాతీయస్థాయి బ్రోంజ్ డిస్క్ పురస్కారానికి ఎంపికైనా ఫైర్ కానిస్టేబుల్ వెంకటేశ్వర్లు   •   గోల్డెన్ అవర్ లో సరైన చర్యలు తీసుకుంటే ప్రాణాలను రక్షించవచ్చు   •   ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో విద్యార్థుల నిరసన   •   ఉస్మానియా యూనివర్సిటీ పాలకమండలి ఈసీ సభ్యురాలుగా డాక్టర్ బి.సుజాత   •   కులగణన లెక్కలు పబ్లిక్ డొమైన్‌లోకి మల్లన్న నిరంతర పోరాట ఫలితం   •   ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలి   •   నార్సింగిలో ఉద్యోగుల నిరసన.. తహశీల్దార్‌కు వినతిపత్రం సమర్పణ   •   రోడ్డు ప్రమాద సమయంలో గోల్డెన్ అవర్ ప్రాముఖ్యతపై అవగాహన   •   విద్యుత్ షాక్‌తో పశువు మృతి   •  

రక్తదానానికి యువత ముందుకు రావాలి..

24-05-2025 07:56 PM

అడిషనల్ సూపరిండెంట్ ఆఫ్ పోలీస్ చైతన్య రెడ్డి..

కామారెడ్డి (విజయక్రాంతి): తలసేమియా వ్యాధితో బాధపడుతున్న చిన్నారుల ప్రాణాలను కాపాడడం కోసం మే 26 సోమవారం రోజున కామారెడ్డి రక్తదాతల సమూహం, లయన్స్ క్లబ్ ఆఫ్ వివేకానంద, ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషనల్(International Vysya Federal) ఆధ్వర్యంలో ఆదిత్య హాస్పిటల్ కామారెడ్డిలో నిర్వహించనున్న మెగా రక్తదాన శిబిరానికి సంబంధించిన కరపత్రాలను అడిషనల్ సూపరిండెంట్ ఆఫ్ పోలీస్ చైతన్య వారి కార్యాలయంలో విడుదల చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఏఎస్పీ చైతన్య రెడ్డి మాట్లాడుతూ... రక్తదానానికి యువత ముందుకు రావాలని రక్తదానం ప్రాణదానంతో సమానమని అన్నారు.

తెలంగాణ వ్యాప్తంగా 10 వేల మంది తలసేమియా చిన్నారులు ఉండడం చాలా బాధాకరం అని, వారి ప్రాణాలను కాపాడడానికి రక్తదాన శిబిరాలు నిర్వహించడం అభినందనీయమని అన్నారు. రక్తదానం చేస్తున్న రక్తదాతలకు ప్రశంస పత్రాన్ని, స్టీల్ వాటర్ బాటిల్ ను ఆదిత్య హాస్పిటల్ వారి సహకారంతో అందజేయడం జరుగుతుందని నిర్వాహకులు తెలియజేశారు. రక్తదానం చేయాలనుకున్న రక్తదాతలు 9492874006 నెంబర్ కు సంప్రదించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఐవిఎఫ్ సేవాదళ్ రాష్ట్ర చైర్మన్ డాక్టర్ బాలు, లయన్స్ క్లబ్ ఆఫ్ కామారెడ్డి అధ్యక్షులు చిలువేరు మారుతి, కామారెడ్డి రక్తదాతల సమూహ అధ్యక్షులు జమీల్ హైమద్ ఉపాధ్యక్షులు పర్శ వెంకటరమణలు పాల్గొనడం జరిగింది.