30 June, 2026 | 11:52 PM

Breaking News

పెంచికల్‌పేట్ పోలీస్ స్టేషన్‌ను తనిఖీ చేసిన ఎస్పీ   •   మండల అధ్యక్షులుగా అంకం శ్రీనివాస్   •   రాంకీ డంపింగ్ యార్డ్ తొలగింపే లక్ష్యం   •   రాష్ట్రంలో ఎక్కడ చూసినా కులవివక్షత కొనసాగుతుంది   •   ఉపాధ్యాయులు, ఎస్‌ఎస్‌ఏ సిబ్బంది సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి   •   ఓటరు ఎన్యూమరేషన్ (SIR )పారాలు బిఎల్ఓ యాప్ లో నమోదు చేయాలి   •   దుండిగల్ వార్డులో సీఎంసీ కమిషనర్ శ్రీజన ఐఎఎస్ పర్యటన   •   అక్కంపల్లి గ్రామంలో హరితవనాలు, ఫిట్టింగ్ పనులు పరిశీలించిన డిఆర్డిఓ కుటుంబరావు   •   హనుమాన్ ఆలయంలో చోరీ   •   డీడీఎన్ అర్చక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులుగా బసవలింగప్ప ఎన్నిక   •  

సర్వే పారితోషికం వెంటనే విడుదల చేయాలి

24-05-2025 07:58 PM

నాగల్ గిద్ద (విజయక్రాంతి): నాగలిగిద్ద మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయానికి మండల ఉపాధ్యాయులు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సమగ్ర ఆర్థిక, కులగణన సర్వే 2024 యొక్క పారితోషకం సర్వే నిర్వహించి దాదాపు ఆరు నెలలు గడిచిన ఇంత వరకు ఉపాధ్యాయులకు అందకపోవడంతో మండలంలోని ఉపాధ్యాయులు అందరూ కలిసి మండల ఎంపీడీవో కార్యాలయంలో ఇంచార్జ్ సూపర్డెంట్ పి శంకర్ కి వినతి పత్రం అందజేశారు. పై అధికారులను సంప్రదించి వెంటనే పారితోషికం మంజూరు చేయించాలని ఉపాధ్యాయులు విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో కారముంగీ కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు రవీందర్ రావు, మండల పిఆర్టియు అధ్యక్షులు శేరీకర్ రమేష్, ఎస్టియు అధ్యక్షులు విజయ్ కుమార్, తపస్ అధ్యక్షులు ఓంబసవ మండల ఉపాధ్యాయులు పాల్గొన్నారు.