15 April, 2026 | 12:52 PM

Breaking News

మహిళలంటే రేవంత్ రెడ్డికి ఎందుకు వివక్ష?.. సీఎంకు ఎంపీ లక్ష్మణ్ కౌంటర్   •   ఎంపీ అశోక్ మిట్టల్‌ వ్యాపార సంస్థలపై ఈడీ దాడులు   •   బీహార్ రాజకీయాల్లో చారిత్రక ఘట్టం... సీఎంగా సామ్రాట్‌ చౌదరి   •   రేవంత్‌ రెడ్డితో పీసీసీ చీఫ్, మీనాక్షి నటరాజన్ భేటీ   •   తెలంగాణ పర్యాటక రంగాన్ని బలోపేతం చేస్తాం: మంత్రి జూపల్లి   •   ఛత్తీస్‌గఢ్‌లో భారీ పేలుడు: 14కు చేరిన మృతుల సంఖ్య.. న్యాయవిచారణకు కాంగ్రెస్ డిమాండ్   •   AP Inter Results 2026: ఏపీ ఇంటర్ ఫలితాలు విడుదల   •   పంజాబ్‌లో బస్సు బోల్తా: ఆరుగురు యాత్రికులు మృతి   •   దక్షిణాదిలో ప్రజాఉద్యమం తప్పదు.. కేంద్ర ప్రభుత్వానికి KTR హెచ్చరిక   •   సంక్షేమ- అభివృద్ధి సమన్వయమే ప్రభుత్వ ధ్యేయం: మంత్రి పొంగులేటి   •  

భక్తజన మేడారం

24-01-2026 12:28 AM
  1.   5 లక్షలకు పైగా జనం రాక
  2. వనదేవతలకు మొక్కులు
  3. జంపన్న వాగులో గల్లంతైన వారిని రక్షించిన రెస్క్యూ టీం 
  4. హోర్డింగు కూలి భక్తుడికి గాయాలు 

మేడారం, జనవరి 23 (విజయక్రాంతి): మేడారం సమ్మక్క సారలమ్మ జాతరకు భక్తుల రాక రోజు రోజుకూ పెరుగుతున్నది. శుక్రవారం 5 లక్షలకు పైగా భక్తులు వనదేవతల దర్శనానికి వచ్చినట్లు అధికార వర్గాలు పేర్కొం టున్నాయి. జంపన్నవాగు పుణ్యస్నానం ఆచరించే భక్తులతో కిక్కిరిసిపోయింది. భూపాలపల్లికి చెందిన మేకల జంపయ్య, మేకల సరిత, మేకల శిరీష జంపన్నవాగులో స్నానం చేస్తూ నీట మునిగిపోయారు. అక్కడే విధుల్లో ఉన్న ఎస్‌డిఆర్‌ఎఫ్ సిబ్బంది వారిని రక్షించారు.

జాతరలో హరితహోటల్ జంక్షన్ వద్ద ఏర్పాటు చేసిన ఎల్‌ఈడీ లైటింగ్ నేమ్ బోర్డ్ ఒక్కసారిగా కూలింది. అక్కడే ఉన్న మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండ లం రాంపూర్‌కు చెందిన ఎడ్ల నరసయ్యకు గాయాలు అయ్యాయి. టీటీడీ కళ్యాణ మండపంలోని ఆసుపత్రికి తరలించి చికిత్స నిర్వహించారు.

వనదేవతల గద్దెల ప్రాం గణంలో శుక్రవారం భక్తులు విసిరిన కొబ్బరికాయలు బంగారం (బెల్లం) తగిలి 9 మంది గాయపడ్డారు. కలెక్టర్ దివాకర టీఎస్, ఎస్పీ కేకన్ సుధీర్ రామ్నా థ్ జాతరలో భక్తుల రద్దీ నియంత్రణ, వసతుల కల్పన అంశాలను ఎప్పటికప్పుడు పరిశీలిస్తున్నారు.