15 April, 2026 | 1:15 PM

Breaking News

మహిళలంటే రేవంత్ రెడ్డికి ఎందుకు వివక్ష?.. సీఎంకు ఎంపీ లక్ష్మణ్ కౌంటర్   •   ఎంపీ అశోక్ మిట్టల్‌ వ్యాపార సంస్థలపై ఈడీ దాడులు   •   బీహార్ రాజకీయాల్లో చారిత్రక ఘట్టం... సీఎంగా సామ్రాట్‌ చౌదరి   •   రేవంత్‌ రెడ్డితో పీసీసీ చీఫ్, మీనాక్షి నటరాజన్ భేటీ   •   తెలంగాణ పర్యాటక రంగాన్ని బలోపేతం చేస్తాం: మంత్రి జూపల్లి   •   ఛత్తీస్‌గఢ్‌లో భారీ పేలుడు: 14కు చేరిన మృతుల సంఖ్య.. న్యాయవిచారణకు కాంగ్రెస్ డిమాండ్   •   AP Inter Results 2026: ఏపీ ఇంటర్ ఫలితాలు విడుదల   •   పంజాబ్‌లో బస్సు బోల్తా: ఆరుగురు యాత్రికులు మృతి   •   దక్షిణాదిలో ప్రజాఉద్యమం తప్పదు.. కేంద్ర ప్రభుత్వానికి KTR హెచ్చరిక   •   సంక్షేమ- అభివృద్ధి సమన్వయమే ప్రభుత్వ ధ్యేయం: మంత్రి పొంగులేటి   •  

జీవాల ఎదుగుదలకు నట్టల నివారణ మందు తప్పనిసరి

24-12-2025 06:59 PM

నకిరేకల్,(విజయక్రాంతి): జీవాల ఎదుగుదలకు నట్టల నివారణ మందు తప్పనిసరి అని మండల పశువైద్యాధికారులు జె.రామ్ రెడ్డి, బి.రవికుమార్ పేర్కొన్నారు. బుధవారం మండలంలోని గొల్లగూడెం గ్రామంలో నట్టల నివారణ మందు కార్యక్రమాన్ని స్థానిక సర్పంచ్ చిర్రబోయిన లక్ష్మి సత్యనారాయణ ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు.గొల్లగూడెం, నరసింహపురం గ్రామాలలో 1850 గొర్రెలు, 150 మేకలకు నట్టల నివారణ మందును తాపించారు. ఈ కార్యక్రమంలో ఎల్ ఎస్ ఏ లు కె. భానుచందర్, ఎ. శ్రీశైలం, ఆఫీస్ సబార్డినేటర్స్ బి దుర్గాప్రసాద్, అఖిల్, గోపాలమిత్ర ఎల్లంల శంభు లింగం యాదవ్ పాల్గొన్నారు.