22 July, 2026 | 7:15 PM

Breaking News

వర్షవాస్ కమిటీ అధ్యక్షుడిగా శ్యామ్‌ రావు ​ఏకగ్రీవం   •   వాసవి క్లబ్ ఆధ్వర్యంలో జాతీయ పతాక స్వీకారోత్సవం కార్యక్రమం   •   సర్ డిజిటలైజేషన్ ప్రక్రియను పరిశీలించిన మండల కోఆర్డినేటర్ సురభి రాజేష్   •   ఎవరెస్ట్ శిఖరంపై జెండా ఎగరాలి: కలెక్టర్ రాజర్శి షా   •   విజయ రమణారావుకు క్యాబినెట్ మంత్రి హోదాపై సంబరాలు   •   రాష్ట్ర బాధ్యతలతో సందీప్‌కు సన్మానం   •   జాతీయ పతాక గౌరవాన్ని చాటిన లయన్స్ క్లబ్ నేరేడుచర్ల   •   ప్రభుత్వ స్థలాలపై నిఘా ఉంచాలి   •   హుస్నాబాద్‌లో మూడు జిల్లాల అధికారులతో జరిగే ఎల్‌నినో సమీక్ష ఏర్పాట్ల పరిశీలన   •   గురుకులంలో గోరింటాకు సందడి   •  

జిల్లాలో పార్టీ స్థితిగతులపై చర్చ

22-12-2025 12:00 AM

సీఎం, డిప్యూటీ సీఎంలను కలిసిన డీసీసీ అధ్యక్షుడు

ఆదిలాబాద్, డిసెంబర్ 21 (విజయక్రాంతి) : రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కతో పాటు పలువురు మంత్రులను డీసీసీ అధ్యక్షులు డా.నరేష్ జాదవ్ కలిసారు. హైదరాబాదులో ఆదివారం ఉట్నూర్ ఎమ్మెల్యే వెడమ బొజ్జు పటేల్, బెల్లంపల్లి ఎమ్మెల్యే వినోద్ లతో కలిసి సీఎం, డిప్యూటీ సీఎం తో పాటు మంత్రి సీతక్క ను మర్యాదపూర్వకంగా కలిసారు. ఈ సందర్భంగా ఆదిలాబాద్ జిల్లా అభివృద్ధి అంశాలు, అలాగే ఇటీవల జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ అభ్యర్థులు సాధించిన విజయం  గురించి వారికి  వివరించారు. ఈ సందర్భంగా జిల్లాలో మౌలిక వసతుల అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం తీసుకోవాల్సిన చర్యలపై వినతులు సమర్పించారు. పార్టీ బలోపేతం, ప్రజా సంక్షేమ కార్యక్రమాల అమలుపై సుదీర్ఘంగా చర్చించడం జరిగిందని డీసీసీ అధ్యక్షుడు తెలిపారు.