23-12-2025 12:39:52 AM
కామారెడ్డి,(విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా దోమకొండ మండల పరిధిలోనీ గ్రామపంచాయతీలో ఎన్నికల్లో ప్రజలు ఎన్నుకున్న నూతన సర్పంచ్, ఉప సర్పంచ్, వార్డు సభ్యుల ద్వారా ఆయా గ్రామ పంచాయతీల ప్రత్యేక అధికారులు సీతారాం పల్లి, లింగుపల్లి, సంగమేశ్వర్, గొట్టుముక్కుల, ముత్యంపేట్, చింతామణి పల్లి, అంబర్పేట్, అంచనూర్, గ్రామాలలో సోమ వారం ప్రమాణ స్వీకరాలు చేయించారు. దోమకొండ మండలంలోని ఆయా గ్రామ పంచాయతీలో సర్పంచ్, ఉప సర్పంచ్, వార్డు సభ్యులతో ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సందర్భంగా సర్పంచ్లు మాట్లాడుతూ... అందరి సహకారంతో గ్రామాన్ని అభివృద్ధి పథంలో నడిపించేందుకు కృషి చేస్తామని హామీ ఇచ్చారు.