28-07-2025 11:00:44 PM
ఖమ్మం (విజయక్రాంతి): స్థానిక 44వ డివిజన్ లో వ్యవసాయ శాఖ మంత్రివర్యులు తుమ్మల నాగేశ్వర రావు ఆదేశానుసారం, స్థానిక కార్పొరేటర్ పాలెపు విజయ వెంకటరమణ(Corporator Palepu Vijaya Venkataramana) సీఎంఆర్ఎఫ్ చెక్కులను సోమవారం లబ్ధిదారులకు అందజేశారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ విజయ వెంకట రమణ మాట్లాడుతూ, కాంగ్రెస్ ప్రభుత్వం పేదల కోసం అనేక కార్యక్రమాలు చేపడుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో డివిజన్ కాంగ్రెస్ నాయకులు, మైనార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.