20 June, 2026 | 3:40 PM

Breaking News

రైతు కుటుంబాన్ని పరామర్శించనున్న కేటీఆర్   •   హైదరాబాద్ రోడ్డుకి ట్రంప్ పేరు పెట్టడాన్ని నిరసిస్తూ నల్ల జెండాలతో ప్రదర్శన   •   'పది'లో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు నగదు ప్రోత్సాహకం   •   జనపనార పైలెట్ ప్రాజెక్టు పై అవగాహన సదస్సు   •   23న రాష్ట్ర వ్యాప్త పాఠశాలల బంద్   •   అనురాగ్ లో 5రోజుల ఉపాధ్యాయ శిక్షణా తరగతులు ప్రారంభం   •   ఎస్‌ఐఆర్ విజయవంతానికి ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి   •   కలెక్టర్ కోయ శ్రీహర్షను అభినందించి, సన్మానించిన ప్రభుత్వ విప్ విజయరమణ రావు   •   జ్యోతినగర్‌లో అభివృద్ధి పనులను ప్రారంభించిన కేంద్ర మంత్రి బండి   •   మండల ఉపసర్పంచుల ఫోరం   •  

దేవాపూర్‌లో కాంగ్రెస్ బాకీ కార్డుల పంపిణీ

13-10-2025 12:00 AM

పంపిణీ చేసిన మాజీ ఎమ్మెల్యే చిన్నయ్య

బెల్లంపల్లి, అక్టోబర్ 12 : కాసిపేట మండలంలోని దేవాపూర్ గ్రామంలో ఆదివారం ప్రజలకు కాంగ్రెస్ పార్టీ పార్టీ కార్డులను బెల్లంపల్లి మాజీ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య పంపిణీ చేసి వివరించారు. ముందుగా దేవాపూర్ లోని కొమరం భీమ్ విగ్రహానికి కాంగ్రెస్ బాకీ కార్డు అందజేసే ప్రయత్నం చేశారు.

అసెంబ్లీ ఎన్నికల సమయంలో అధికారంలోకి రావడానికి గ్యారెంటీ కార్డు ద్వారా కాంగ్రెస్ ప్రభుత్వం అమలు కాని హామీలు ఇచ్చి తెలంగాణ ప్రజలను మోసం చేసిందని ఆరోపించారు.

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెంటనే ప్రజలకు క్షమాపణ చెప్పి తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ప్రజలే గుణపాఠం చెప్పాలని కోరారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య వెంట బి ఆర్ ఎస్ నాయకులు రమణారెడ్డి తో పాటు పలువురు నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.