9 May, 2026 | 3:34 PM

Breaking News

బంద్ విజయవంతం చేసిన ప్రజలకు ధన్యవాదాలు   •   బండి సంజయ్ కొడుకుపై పోక్సో కేసు.. స్పందించిన సబితా ఇంద్రారెడ్డి   •   రేపు హైదరాబాద్‌కు ప్రధాని మోదీ.. పర్యటన షెడ్యూల్‌ ఇదే..!   •   వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని తనిఖీ చేసిన జిల్లా సహకార అధికారి రామ్మోహన్ రావు   •   సొసైటీ అసిస్టెంట్ మృతుడు కుటుంబానికి ఆర్థిక సాయం అందజేత   •   VOAల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తా   •   సచివాలయంలో పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ సమావేశం   •   శ్రీశైలంలో మరో సైబర్ మోసం.. ఢిల్లీ భక్తులకు టోకరా   •   బొంద పెట్టడానికి స్థలం లేదు..!   •   రాష్ట్ర ప్రభుత్వం పంట కొనుగోళ్ల కోసం చిత్తశుద్ధితో పని చేస్తుంది   •  

దుర్గామాత మండపంలో నోట్ పుస్తకాల పంపిణీ

29-09-2025 10:27 PM

చిట్యాల (విజయక్రాంతి): దుర్గామాత మండపంలో ఆసరా స్వచ్ఛంద సేవా సంస్థ వ్యవస్థాపక అధ్యక్షుడు మేడి హరికృష్ణ సోమవారం విద్యార్థులకు నోట్ బుక్స్, పెన్నులను పంపిణీ చేశారు. కనకదుర్గ అమ్మవారి ఆశీస్సులతో నార్కట్పల్లి మండలం చౌడంపల్లి  గ్రామ ప్రజలు సుఖసంతోషాలతో వర్ధిల్లాలని ఆయన గ్రామంలోని చత్రపతి శివాజీ యూత్ ఆధ్వర్యంలో దేవి శరన్నవరాత్రి ఉత్సవాలలో భాగంగా 8వ రోజు శ్రీ సరస్వతీ దేవిగా అమ్మవారి దర్శనం ఇవ్వగా దుర్గామాతను దర్శించుకుని ప్రత్యేక పూజలు చేసి అనంతరం విద్యార్థులకు నోట్ పుస్తకాలు, పెన్నులు పంపిణీ చేశారు. ఎంతో మహిమ కలిగిన శ్రీ కనకదుర్గమ్మ తల్లిని భక్తిశ్రద్ధలతో కొలవాలని, దుర్గమ్మ తల్లి ఆశీస్సులు అందరి పైన ఉండాలని, రైతులు సుఖసంతోషాలు ఆయురారోగ్యాలతో పాడిపంటలతో విలసిల్లాలని ఆయన వేడుకున్నారు. ఈ యొక్క కార్యక్రమంలో కమిటీ సభ్యులు చెరుకుపల్లి వినయ్ కుమార్, గణేష్, విష్ణు, సురేష్,శివకుమార్, విశ్వతేజ, విగ్నేష్, రోహిత్ గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు.