31 March, 2026 | 2:12 PM

Breaking News

వెలుగులోకి కల్తీ అల్లం పేస్ట్ వ్యవహారం... హైదరాబాద్‌లో వ్యాపారి అరెస్టు   •   చైత్ర మాసం చివరి రోజున ఆలయంలో తొక్కిసలాట: 8 మంది మృతి   •   గురుకుల విద్యను సద్వినియోగం చేసుకోవాలి   •   ఈదురు గాలులకు నేలకొరిగిన వరి, జొన్న పంట   •   మార్కెట్ కమిటీ ఆధ్వర్యంలో ఉచిత పశు వైద్య శిబిరం — రైతుల నుంచి విశేష స్పందన   •   హైదరాబాద్‌లో జయలలిత ఇంటికి సీల్   •   ఆకాల వర్షాలకు పంటలు ఆగం.. తీవ్ర ఆందోళ‌న‌లో నిజామాబాద్ రైతులు   •   బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డికి సీఐడీ నోటీసులు   •   పట్టాలు తప్పిన గూడ్స్.. ట్రాక్‌పై అడ్డంగా పడిన పాల ట్యాంకర్   •   ప్రైవేటు ట్రావెల్స్ బస్సులో మంటలు.. తప్పిన పెను ప్రమాదం   •  

విద్యార్థులకు నోటు బుక్కులు, పెన్నులు పంపిణీ

09-01-2026 06:41 PM

సామాజిక కార్యకర్త దేశాయిపేట్ ప్రశాంత్

బాన్సువాడ,(విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా బాన్సువాడ మండలం దేశాయిపేట గ్రామం లోని ఎస్సీ కాలనీలో గల ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల  విద్యార్థిని, విద్యార్థులకు శుక్రవారం దేశాయిపేట గ్రామ యువ నాయకులు సామాజిక కార్యకర్త దేశాయిపేట బి.ప్రశాంత్ కుమార్ నోటు బుక్కులు, పెన్నులు అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... చదువు గొప్పతనం ఏమిటంటే మనిషి జీవితాన్ని పూర్తిగా మార్చేస్తుంది.

జ్ఞానాన్ని, ఆత్మవిశ్వాసాన్ని, వినయాన్ని ఇచ్చి ఆర్థిక పరిస్థితిని మెరుగుపరచి, మంచి నడవడికను నేర్పిస్తుంది, ఒత్తిడిని తగ్గించి మానసిక ప్రశాంతతను కలిగిస్తుంది. పేదరికాన్ని పారద్రోలి, ఉన్నతమైన జీవితాన్ని అందిస్తుందని, సమాజంలో గౌరవాన్ని తెచ్చిపెడుతుంది. సుఖశాంతులను ప్రసాదిస్తుందని ప్రశాంత్ కుమార్ తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయురాలు జి.స్వరూప రాణి, గ్రామస్తులు పాల్గొన్నారు.