13 July, 2026 | 9:38 PM

Breaking News

ఫేక్ ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్తో పట్టా మార్పిడిపై విచారణ అధికారిగా ఆర్డీవో మధు   •   నులిపురుగుల నివారణ మాత్రలు తప్పక వేయించాలి   •   వైటీసీ ద్వారా నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించాలి   •   జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవ సందర్బంగా ఆల్బండజోలు మాత్రలు పంపిణి   •   పదోన్నతిపై బదిలీ అయిన పోస్టల్ ఉద్యోగులకు ఘనంగా సన్మానం   •   విద్యార్థినీల పట్ల నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవు   •   ప్రజావాణి దరఖాస్తులు క్షేత్రస్థాయిలోకి వెళ్లి పరిష్కరించాలి   •   లక్క పురుగుతో ఇబ్బందులు పడుతుంటే అధికారులు నిద్రపోతున్నారా..?   •   వైటీపీఎస్ టెండర్లను రద్దు చేయాలి   •   రహదారి నిర్మాణం చేప‌ట్టాల‌ని వినతి   •  

విద్యార్థులకు నోటు బుక్కులు, పెన్నులు పంపిణీ

09-01-2026 06:41 PM

సామాజిక కార్యకర్త దేశాయిపేట్ ప్రశాంత్

బాన్సువాడ,(విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా బాన్సువాడ మండలం దేశాయిపేట గ్రామం లోని ఎస్సీ కాలనీలో గల ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల  విద్యార్థిని, విద్యార్థులకు శుక్రవారం దేశాయిపేట గ్రామ యువ నాయకులు సామాజిక కార్యకర్త దేశాయిపేట బి.ప్రశాంత్ కుమార్ నోటు బుక్కులు, పెన్నులు అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... చదువు గొప్పతనం ఏమిటంటే మనిషి జీవితాన్ని పూర్తిగా మార్చేస్తుంది.

జ్ఞానాన్ని, ఆత్మవిశ్వాసాన్ని, వినయాన్ని ఇచ్చి ఆర్థిక పరిస్థితిని మెరుగుపరచి, మంచి నడవడికను నేర్పిస్తుంది, ఒత్తిడిని తగ్గించి మానసిక ప్రశాంతతను కలిగిస్తుంది. పేదరికాన్ని పారద్రోలి, ఉన్నతమైన జీవితాన్ని అందిస్తుందని, సమాజంలో గౌరవాన్ని తెచ్చిపెడుతుంది. సుఖశాంతులను ప్రసాదిస్తుందని ప్రశాంత్ కుమార్ తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయురాలు జి.స్వరూప రాణి, గ్రామస్తులు పాల్గొన్నారు.