పకృతి పర్యావరణంపై విద్యార్థులకు అవగాహన
09-01-2026 06:45 PM
నిర్మల్,(విజయక్రాంతి): నిర్మల్ పట్టణంలోని బుధవార్పేట్ శిశు మందిర్ విద్యార్థులు పకృతి పర్యావరణం మొక్కల పరిరక్షణ ప్లాస్టిక్ వాడకం వల్ల కలిగే అనర్థాలను పర్యాటకులకు వివరించినట్టు ప్రధాన ఉపాధ్యాయులు నరేష్ తెలిపారు. నిజాంబాద్ జిల్లాలోని అలీ సాగర్ ఇతర పర్యాటక ప్రదేశాలకు వెళ్లి పకృతి పరిరక్షణపై ప్రజలకు అవగాహన కల్పించడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు పాల్గొన్నారు.




