29-09-2025 12:04:15 AM
మహబూబాబాద్, సెప్టెంబర్ 28 (విజయక్రాంతి): మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండలంలోని 3 గ్రామాలకు చెందిన 100 మంది కోలాటం మహిళలకు దసరా పండుగను పురస్కరించుకొని ఎస్ జీ ఎఫ్ ఆధ్వర్యంలో చీరలు పంపిణీ చేశారు. కోలాటం ప్రదర్శించే మహిళలకు ప్రోత్సాహకంగా దసరా కానుకగా చీరలు అందించినట్లు ఎస్ జీ ఎఫ్ చైర్మన్ చిలువేరు సమ్మయ్య గౌడ్ తెలిపారు.