17 April, 2026 | 2:45 PM

Breaking News

డీలిమిటేషన్ 'డీమోనిటైజేషన్' లాంటిదే: శశిథరూర్   •   తేజస్వీ సూర్య వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన మాజీ ఎంపీ నామ   •   కాళేశ్వరంలో జరిగిన పొరపాట్లు.. తెలంగాణ ప్రజలకు తెలుసు   •   ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి తంగళ్ళపల్లిలో వినతి పత్రాల కార్యక్రమం   •   25 క్వింటాళ్ల రేషన్ బియ్యం సీజ్   •   హుజూర్ నగర్ సీనియర్ సివిల్ జడ్జిగా శ్యామ సుందర్   •   విద్యార్థిని మృతి... ప్రభుత్వంపై తెలంగాణ బీసీ సంక్షేమ సంఘంతీవ్ర విమర్శలు   •   మాణిక్ గూడ గ్రామ సంరక్షణకు చర్యలు   •   సేవ చేయాలనే సంకల్పంతోనే రాజకీయాల్లోకి   •   వేములవాడ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో సర్వర్ డౌన్.. నిలిచిపోయిన రిజిస్ట్రేషన్లు   •  

మున్సిపల్ సిబ్బందికి స్వెట్టర్ల పంపిణీ

15-12-2025 10:33 PM

కేసముద్రం (విజయక్రాంతి): కేసముద్రం మున్సిపాలిటీ పరిధిలో పనిచేస్తున్న 85 మంది పారిశుద్ధ్య కార్మికులకు వేం చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో స్వెట్టర్లు, రేడియం జాకెట్లు పంపిణీ చేశారు. చలి నుండి రక్షించడానికి, ప్రమాదాల నుండి నివారించడానికి స్వెటర్లు, జాకెట్లు అందజేసినట్లు వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ గంట సంజీవరెడ్డి తెలిపారు. పారిశుద్ధ్య కార్మికుల సంక్షేమం పట్ల దాతృత్వం చూపించిన వేం చారిటబుల్ ట్రస్ట్ నిర్వాహకులు డాక్టర్ వేం కృష్ణ భార్గవ్ రెడ్డికి మున్సిపల్ కమిషనర్ శ్రీనివాసరావు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు అల్లం నాగేశ్వరరావు, రావుల మురళి, అంబటి మహేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.