విద్యుత్ సిబ్బందికి టీ షర్టుల పంపిణీ
02-10-2025 12:11 AM
మహబూబాబాద్, అక్టోబర్ 1 (విజయక్రాంతి): మహబూబాబాద్ జిల్లా కేసముద్రం విద్యుత్ శాఖ సబ్ డివిజన్ సిబ్బందికి దసరా పండుగను పురస్కరించుకొని టీ షర్టుల పంపిణీ చేశారు. ఏడీఈ మచ్చ ఐలయ్య, ఏఈ రాజు, సబ్ ఇంజనీర్ కర్ణాకర్, ఎస్ ఎల్ ఐ, ఎల్ఐ, ఏఎల్ఎం, జేఎల్ఎం, కట్టర్స్, స్పాట్ బిల్డర్స్ పాల్గొన్నారు.




