22-07-2025 04:22:19 PM
వలిగొండ,(విజయక్రాంతి): వలిగొండ మండలంలోని నాగారం గ్రామానికి చెందిన కట్ట అశోక్ తన తల్లిదండ్రులైన కట్ట లక్ష్మమ్మ హనుమయ్యల జ్ఞాపకార్థం ప్రాథమికోన్నత పాఠశాలకు 15 బెంచీలను బహుకరించడం జరిగింది. ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు జీవనజ్యోతి పాఠశాలకు బెంచీలు బహుకరించిన కట్ట అశోక్ ను సన్మానించి అభినందించారు.