22-07-2025 04:19:54 PM
మహబూబాబాద్,(విజయక్రాంతి): మహబూబాబాద్ మండలం ఎం.పీ.పీ.ఎస్. హజారియా తండా పాఠశాల విద్యార్థులకు పాఠశాల చైర్మన్ స్వాతి సుమన్ 5వేల రూపాయల విలువైన 20 కుర్చీలను బహుకరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో కాంప్లెక్స్ హెడ్మాస్టర్ శ్రీరాములు మాట్లాడుతూ... పేద విద్యార్థుల విద్యాభివృద్ధి కోసం దాతలు ముందుకు రావడం పట్ల హర్షం వ్యక్తం చేశారు.