16 April, 2026 | 10:48 PM

Breaking News

సదాశివపేట పట్టణ ప్రజల తాగునీటి సమస్యలపై జగ్గారెడ్డి, నిర్మల సమీక్ష   •   గురుకుల విద్యాలయాలపై నిరంతర పర్యవేక్షణ: కలెక్టర్ బాదావత్ సంతోష్   •   బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య వ్యాఖ్యలను ఖండించిన హరీశ్‌రావు   •   ముస్లిం రిజర్వేషన్లు రాజ్యాంగ విరుద్ధం: అమిత్ షా   •   పెళ్లి చేసుకుంటానని మహిళపై అత్యాచారం.. బీజేపీ కౌన్సిలర్ కుమారుడిపై కేసు   •   99 రోజుల ప్రజాపాలన ప్రగతి ప్రణాళికతో సమగ్ర మార్పు తీసుకురావాలి   •   ముదిరాజులు అన్ని రంగాల్లో రాణించాలి   •   మూడు మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు   •   ప్రభుత్వం హామీలు అమలు చేయకపోతే.. ఏప్రిల్ 22 నుంచి సమ్మె   •   సమన్వయంతో పనిచేస్తేనే అభివృద్ధి సాధ్యం   •  

అర్హులైన పేదలకు డబుల్‌ బెడ్‌రూంలు మంజూరు చేయాలి

16-05-2025 03:05 PM

రామకృష్ణాపూర్,(విజయక్రాంతి): రామకృష్ణాపూర్ పట్టణంలోని నిర్మించిన డబుల్ బెడ్రూం(Double bedrooms) ఇండ్లను అర్హులైన పేదలను లబ్ధిదారులుగా గుర్తించి వారికి మాత్రమే అందించాలని బిఆర్ఎస్ నాయకులు డిమాండ్ చేశారు.గురువారం మందమర్రి మండల తహసిల్దార్ కు బిఆర్ఎస్ నాయకులు వినతి పత్రం అందజేశారు.డబుల్ బెడ్రూం ఇండ్ల కొరకు ఆన్లైన్ లో రిజిస్ట్రేషన్ చేసుకొని వాళ్లకు ఏ ప్రతిపాదికన వారికి ఇండ్లను ఈ ప్రభుత్వం కేటాయిస్తుందని బిఆర్ఎస్ నాయకులు రామిడి కుమార్ ప్రశ్నించారు.

ఎన్నో ఏళ్లుగా గూడులేక పేదలు ఇబ్బందులు పడుతుంటే ఇళ్లు ఉన్నవారి,గత ప్రభుత్వం నుండి ఇంటి పట్టాలు పొందిన వారికి ఇళ్లను కేటాయించడం సరైందికాదన్నారు.కాంగ్రెస్ నాయకులు వారి స్వలాభం కొరకు అర్హులు కాని వారికి పేర్లను చేర్చారని వారి పేర్లను జాబితాలో నుంచి వెంటనే తొలగించాలని అలాగే డబుల్ బెడ్రూం ఇండ్ల కేటాయింపు లో ప్రజల నుండి వచ్చిన అభ్యంతరాలను,కొత్తగా అర్జీలను పరిశీలించాలని కోరారు.ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్లు పోగుల మల్లయ్య,రేవెల్లి ఓదెలు,గడ్డం రాజు,రామీడి లక్ష్మి కాంత్,చంద్ర కిరణ్,చంద్రమౌళి,వేముల వెంకటేష్ , సతీష్,రవీందర్,మనీ పాల్గొన్నారు.