12-12-2025 07:52:42 PM
నంగునూరు: నంగునూరు మండల కేంద్రంలోని ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన పోలింగ్ బూత్ను డిఆర్డిఏ ప్రాజెక్టు డైరెక్టర్ (పీడీ) జయదేవ్ ఆర్య శుక్రవారం ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన ఎంపీడీవో మహబూబ్ అలీ,పంచాయతీ కార్యదర్శి చంద్రకళకు తగు సూచనలు చేశారు. ఓటర్లకు, అధికారులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. వారితో ఐకెపి ఏపీఎం వి.శ్రీనివాస్ తదితరులు ఉన్నారు.