2 September, 2026 | 10:24 PM

Breaking News

పెరిక్స్ పై ఇన్కమ్ టాక్స్ రద్దుకు అంగీకరించిన యాజమాన్యం   •   రెవరెండ్ డాక్టర్ గుండెపాక వెంకన్నకు ది ఐకానిక్ ఇండియా అవార్డు   •   గంజాయి సాగుచేస్తున్న వ్యక్తిపై కేసు నమోదు   •   శేషగిరిరావును పరామర్శించిన జనసేన రాష్ట్ర నాయకులు డా గడల శ్రీనివాసరావు   •   నాలుగు క్వింటాళ్ల పీడీఎస్‌ బియ్యం పట్టివేత   •   అక్రమ కేసులు ఎత్తివేయాలి: రాష్ట్ర అధ్యక్షుడు ఎన్‌. రామచందర్‌రావు   •   కాంగ్రెస్‌ 1000 రోజుల పాలనపై బీఆర్‌ఎస్‌ నిరసన   •   క్యాంప్ ఆఫీస్‌పై దాడి హేయమైన చర్య: ఎమ్మెల్యే కుంభం   •   మునిప‌ల్లి ఎస్సీ హాస్ట‌ల్‎ను త‌నిఖీ చేసిన చైర్మ‌న్, మండ‌ల ప్ర‌త్యేకాధికారి   •   పదవులు నా వెంట రావాలి.. భవిష్యత్ సీఎం నేనే!   •  

విశాల్‌కు జోడీగా దుషారా

15-07-2025 | 01:06am

హీరో విశాల్ ఇటీవల ‘మధగజరాజా’ చిత్రంతో అలరించారు. ఇప్పుడు తన 35వ చిత్రాన్ని ప్రారంభించారు. దీన్ని సూపర్‌గుడ్‌ఫిల్మ్స్ పతాకంపై ఆర్‌బీ చైదరి నిర్మిస్తుండగా రవి అరసు దర్శకత్వం వహించనున్నారు. దుషారా విజయన్ కథానాయికగా నటించనుంది. ఈ చిత్రం చెన్నైలో సోమవారం పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. పలువురు సినీప్రముఖు లు ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిలుగా హాజరయ్యారు.

చెన్నై లో చిత్రీకరణ ప్రారంభించి 45 రోజుల సింగిల్ షెడ్యూల్‌లో షూటింగ్‌ను పూర్తి చేయనున్నట్టు చిత్రబృందం ఈ సందర్భంగా వెల్లడించారు. ఈ చిత్రానికి  సంగీత దర్శకుడు: జీవీ ప్రకాశ్‌కుమార్; సినిమాటో గ్రఫీ: రిచర్డ్ ఎం నాథన్; ఎడిటర్: ఎన్‌బీ శ్రీకాంత్; ఆర్ట్: జీ దురైరాజ్.