11-09-2025 12:40:54 AM
కలెక్టర్ ఇలా త్రిపాఠి
చిట్యాల, సెప్టెంబర్ 10(విజయక్రాంతి): జాతీయ కుటుంబ ప్రయోజన పథకం కింద వీలైనంత ఎక్కువ మంది లబ్ధిదారులకు సహాయం అందించేలా మండలాధికారులు కృషి చేయాలని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి అన్నారు. బుధవారం ఆమె నల్గొండ జిల్లా, చిట్యాల తహసిల్దార్ కార్యాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసి జాతీయ కుటుంబ ప్రయోజన పథకం కింద వచ్చిన దరఖాస్తులు, పిఓబి భూములకు సంబంధించిన కేసులను పరిశీలించారు.
ఒకేసారి చనిపోయిన పెద్ద ఇంటి కుటుంబానికి 20వేల రూపాయలు ఆర్థిక సాయం వస్తున్నందున ఎక్కువ మందికి సహాయం అందించేలా మండలాధి కారులు చర్యలు తీసుకోవాలని అన్నారు. పక్కనే ఉన్న నల్గొండ ఆర్ డి ఓ అశోక్ రెడ్డి తో మాట్లాడుతూ వచ్చిన దరఖాస్తులు వచ్చినట్లు పరిశీలించి ఆన్ లైన్ ద్వారా పంపించాలని చెప్పారు. అనంతరం జిల్లా కలెక్టర్ పిఓపి కేసులు, ఇతర భూములకు సంబంధించిన కేసులను పరిశీలించారు. తహసిల్దార్ కృష్ణ, డిప్యూటీ తహసిల్దార్ విజయ, కార్యాలయ సిబ్బంది ఉన్నారు.