11-09-2025 12:38:59 AM
కోదాడ డీఎస్పీ శ్రీధర్ రెడ్డి
హుజూర్ నగర్, సెప్టెంబర్ 10: ప్రతి ఒక్కరూ ఉన్నత లక్ష్యం ఎంచుకొని దాన్ని సాధించేందుకు కృషి చేయాలని కోదాడ డీఎస్పీ శ్రీధర్ రెడ్డి అన్నారు. బుధవారం పట్టణంలోని తెలంగాణ మైనారిటీ గల్స్ కళాశాలలో మహిళల రక్షణ చట్టాలు గురించి అవగాహన సదస్సు నిర్వహిం చారు.
ఈ సందర్భంగా డీఎస్పీ శ్రీదర్ రెడ్డి మాట్లాడుతూ.... పాఠశాలలో మనం ఎందుకు ఉన్నాము అనేది గుర్తుంచుకోవాలని చదువు చాలా విలువైనది ప్రపంచంలో చదువుతోనే విజ్ఞానం వెలుగుతుందన్నారు. కష్టపడి చదివి తల్లిదండ్రులకు చదువు చెప్పిన గురువులకు పాఠశాలకు మంచి పేరు తేవాలని కోరారు. బాలికలు అన్ని రంగాల్లో రాణించాలని కోరారు. సీఐ చరమంధ రాజు,ఎస్త్స్ర మోహన్ బాబు, సిబ్బంది, పోలీసు కళా బృందం, పాల్గొన్నారు.