11 April, 2026 | 12:25 PM

Breaking News

రూ.10 కోట్ల మోసం— సింగర్‌ మంగ్లీపై కేసు నమోదు   •   సమయోచిత చర్యలతో గ్రామానికి నీటి భద్రత   •   భాగిర్తిపల్లిలో ఇందిరమ్మ గృహ ప్రవేశం   •   మహాత్మా జ్యోతిరావు పూలే కు ఘన నివాళులు అర్పించిన కాంగ్రెస్   •   ముత్తారంలో మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి వేడుకలు   •   బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి జ్యోతిరావు పూలే   •   పోటు రంగారావుపై NIA ఉపా చట్టం కేసు ఎత్తివేయాలి ‌‌   •   మంగళ్‌హాట్‌లో కార్డెన్ సెర్చ్— గ్యాస్ సిలిండర్లు, బైకులు స్వాధీనం   •   ముంబైలో ఘోర అగ్నిప్రమాదం— సిలిండర్ పేలుళ్లతో తీవ్ర భయాందోళన   •   కర్ణాటకలో యూత్ కాంగ్రెస్‌ నేత దారుణహత్య.. స్థానికుల్లో భయాందోళన!   •  

కలెక్టర్ కార్యాలయం ఎదుట వృద్ధ దంపతుల వంటా వార్పు

25-10-2025 03:40 PM

ధర్మపురి,(విజయక్రాంతి):  జగిత్యాల జిల్లా వెల్గటూర్ మండలం జగదేవ్ పేట గ్రామానికి చెందిన నూకల నర్సవ్వ-మల్లయ్య కుటుంబం వాళ్ల ఇంటికి వెళ్ళడానికి ఉన్న రోడ్డు ను కొర్రి గంగయ్య కుటుంబం కబ్జా చేసారంటూ కలెక్టర్ కార్యాలయం ఎదుట వంటా వార్పుతో నిరసన వ్యక్తం చేశారు. కొర్రి గంగయ్య కుటుంబానికి ఇందిరమ్మ ఇళ్ల స్థలలు రాగా పక్కనే ఉన్న మా ఇంటికి అది కూడా పట్టా భూమిలోకి వెళ్లే రోడ్డు కబ్జాచేసారని వృద్ధ దంపతులు ఆవేదన వ్యక్తం చేశారు. గత రెండు సంవత్సరాలుగా అధికారుల చుట్టూ తిరిగుతున్న పట్టించుకోవడం లేదని కన్నీటి పర్యాంతం అయ్యారు. హైదరాబాద్ లో ప్రజా ధర్బార్ లో సైతం పిర్యాదు చేసిన అధికారులు  పట్టించుకోవడం లేదనీ అన్నారు. సమస్యను పట్టించుకోకాపోగా బెదిరింపులకు గురిచేస్తున్నారనీ బాధితులు వాపోయారు.