18 August, 2026 | 4:55 PM

Breaking News

చెట్లు నరికివేతపై ఫిర్యాదు   •   భిన్న దృక్కోణాల ద్వారా మానసిక సవాళ్లను పరిష్కరించాలి   •   బెస్ట్ ఎంప్లాయి అవార్డు గ్రహీతకు సన్మానం   •   ఆత్మ ఆధ్వర్యంలో రైతులకు శిక్షణ   •   ఎమ్మార్వో పి.విట్టల్, సీఐ వెంకట్ నారాయణకు ఘన సన్మానం   •   భూస్వాముల అన్యాయానికి ఎదురునిలిచిన విప్లవ వీరుడు   •   సిర్గాపూర్‌లో షీటీం ఆధ్వర్యంలో పోలీస్ అవగాహన కార్యక్రమం   •   ఆదివాసీ కాంగ్రెస్ రాష్ట్ర కార్యవర్గ, జిల్లా అధ్యక్షుల ఎన్నికలపై ఎగ్జిక్యూటివ్ సమావేశం   •   ఘనంగా సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ 376వ జయంతి వేడుకలు   •   సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ జయంతి సందర్భంగా ఘన నివాళులు   •  

ఉరివేసుకుని వృద్ధుడి మృతి..

03-07-2025 11:05 PM

బెల్లంపల్లి అర్బన్ (విజయక్రాంతి): మంచిర్యాల జిల్లా(Mancherial District) బెల్లంపల్లిలో కుటుంబ కలహాలు, మద్యానికి బానిసై ఓ వృద్ధుడు ఆత్మహత్య చేసుకున్న సంఘటన గురువారం చోటుచేసుకుంది. వన్ టౌన్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బూడిదిగడ్డ బస్తీకి చెందిన రాధారపు రామచందర్(70) ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. కుటుంబ కలహాలతో కుటుంబానికి కొంతకాలం నుంచి దూరంగా.. అదే బస్తీలో ఒంటరిగా ఉంటున్నాడు. మద్యం తాగి వచ్చి తరచుగా భార్య శాంత ఉన్న ఇంటికి వెళ్ళి గొడవ పడేవాడు. ఎప్పటిలాగే మద్యం తాగొచ్చి భార్యతో గొడవపడ్డాడు. ఇదే క్రమంలో ఇంటికి వెళ్ళిన రామచందర్ ఉరివేసుకొని మృతి చెందాడు. ఈ మేరకు వన్ టౌన్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.