17 April, 2026 | 3:17 PM

Breaking News

ఫిల్మ్‌నగర్‌లో ఆయమ్మ దాష్టీకం.. గుడ్డు అడిగినందుకు విద్యార్థిపై గరిటెతో దాడి   •   తెలంగాణ ఉద్యమాన్ని కించపర్చింది రేవంత్ రెడ్డి కాదా?   •   డీలిమిటేషన్ 'డీమోనిటైజేషన్' లాంటిదే: శశిథరూర్   •   తేజస్వీ సూర్య వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన మాజీ ఎంపీ నామ   •   కాళేశ్వరంలో జరిగిన పొరపాట్లు.. తెలంగాణ ప్రజలకు తెలుసు   •   ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి తంగళ్ళపల్లిలో వినతి పత్రాల కార్యక్రమం   •   25 క్వింటాళ్ల రేషన్ బియ్యం సీజ్   •   హుజూర్ నగర్ సీనియర్ సివిల్ జడ్జిగా శ్యామ సుందర్   •   విద్యార్థిని మృతి... ప్రభుత్వంపై తెలంగాణ బీసీ సంక్షేమ సంఘంతీవ్ర విమర్శలు   •   మాణిక్ గూడ గ్రామ సంరక్షణకు చర్యలు   •  

ఎమ్మెల్యే పాయల్ శంకర్ కృషితో 54 మంది ఉద్యోగుల రెన్యువల్

15-11-2025 07:54 PM

ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలిపిన ఉద్యోగులు..

ఆదిలాబాద్ (విజయక్రాంతి): ఆదిలాబాద్ రిమ్స్ ఆసుపత్రిలో ఉద్యోగుల కొనసాగింపు గందరగోళానికి తెర పడింది. గత 7 నెలలుగా తమను రెన్యువల్ చేయాలంటూ 54 మంది ఔట్సోర్సింగ్ ఉద్యోగులు ఇబ్బందులు పడుతున్నారు. గతంలో ఎమ్మెల్యే పాయల్ శంకర్ కు సైతం తమ సమస్యలు విన్నవించారు. అయితే ఎమ్మెల్యే పలుమార్లు రాష్ట్ర మంత్రితో పాటు డిఎంఈ కి ఉద్యోగుల సమస్యలు విన్నవించారు. దీంతో ఎట్టకేలకు 54 మంది ఔట్సోర్సింగ్ ఉద్యోగులను తిరిగి కొనసాగించేలా తాజాగా ప్రభుత్వం జీవో ను విడుదల చేసింది. దీంతో అవుట్సోర్సింగ్ ఉద్యోగులు హర్షం వ్యక్తం చేశారు. శనివారం ఎమ్మెల్యే పాయల్ శంకర్ ని కలిసి పులబోకె అందించి కృతజ్ఞతలు తెలియజేశారు.