31 May, 2026 | 11:27 PM

Breaking News

సోనాల మండలంలో భారీ వర్షం.. జొన్న రైతుల్లో ఆందోళన   •   సీఎం ఓవర్సీస్ పథకానికి దరఖాస్తు చేసుకోండి   •   రిటైర్డ్ ఎంప్లాయిస్ అసోసియేషన్ తెలంగాణ జేఏసితో ప్రభుత్వం చర్చలు జరపాలి   •   విద్యుత్ కాంట్రాక్టర్ ఒత్తిల్లు... గాల్లో దీపంలా లేబర్ బ్రతుకులు   •   టీఎన్జీవోల ఆధ్వర్యంలో ఉద్యోగ విరమణ సన్మాన మహోత్సవం   •   విద్యుత్ ప్రమాద బీమా చెక్కును అందించిన తుమ్మల యుగంధర్   •   నేటితో ముగియనున్న కొండపైన వర్తక సంఘం లీజు గడువు   •   జనసంద్రంగా యాదగిరి క్షేత్రం   •   మహమ్మద్ జావీద్ శ్రద్ధాంజలి కార్యక్రమంలో పాల్గొన్న కాంగ్రెస్ నాయకులు   •   ఈటలకు వ్యతిరేకంగా ప్లెక్సీలు.. స్పందించిన రాంచందర్   •  

రోడ్డు భద్రత - మాదకద్రవ్యాలపై అవగాహన సదస్సు

15-11-2025 08:54 PM

కామారెడ్డి,(విజయక్రాంతి): జిల్లా రవాణా అధికారి జె. శ్రీనివాస్ సూచనల మేరకు కామారెడ్డి జిల్లా దోమకొండ KGBV జూనియర్ కళాశాలలో రోడ్డు భద్రత, మాదకద్రవ్యాల నివారణపై శనివారం విస్తృత అవగాహన సదస్సులు నిర్వహించారు. కళాశాల ప్రిన్సిపల్ మంగమ్మ  అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో రవాణా శాఖ అధికారులు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు.

సహాయక మోటార్ వెహికల్స్ ఇన్‌స్పెక్టర్లు (AMVI) రఫీ, స్నిగ్ధ, మరియు ఉదయ్ విద్యార్థులకు రోడ్డు భద్రత ప్రాముఖ్యతను వివరించారు. ఈ సందర్భంగా AMVI ఉదయ్ మాట్లాడుతూ... “ప్రతి విద్యార్థి రోడ్డు భద్రత నియమాలను కచ్చితంగా పాటించాలి. చిన్న నిర్లక్ష్యం కూడా ప్రాణనష్టం కలిగించవచ్చు. ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన కలిగి ఉండటం ద్వారా ప్రమాదాలను తగ్గించవచ్చు” అని అన్నారు. అలాగే తల్లిదండ్రులు హెల్మెట్ ధరిస్తేనే పిల్లలు కూడా అలవాటు చేసుకుంటారని గుర్తుచేశారు.

యువత మాదకద్రవ్యాల ప్రలోభాలకు లోనుకాకుండా ఆరోగ్యకరమైన జీవన విధానాన్ని అనుసరించాలని పిలుపునిచ్చారు. తోటి విద్యార్థుల్లో ఎవరైనా మాదకద్రవ్యాలకు బానిసలైనట్లు గమనిస్తే, వెంటనే సంబంధిత అధికారులకు తెలియజేయాలని సూచించారు. కళాశాల ప్రత్యేక అధికారి మంగమ్మ,కళాశాల అధ్యాపకులు, సిబ్బంది,  విద్యార్థులు అధిక సంఖ్యలో పాల్గొనీ ఈ కార్యక్రమంలో రోడ్డు భద్రత నియమావళిపై కరపత్రాలు పంపిణీ చేశారు.