16 April, 2026 | 12:07 PM

Breaking News

వీధి కుక్కల దాడి.. మృత్యువుతో పోరాడి— 15 రోజుల తర్వాత బాలుడు మృతి   •   కామ్రేడ్ పెద్దబ్బాయికు నివాళులర్పించిన పోతినేని సుదర్శన్   •   కర్నూలు జిల్లాలో ఘోర రోడ్డుప్రమాదం: ఎనిమిది మంది భక్తులు మృతి   •   మాజీ సర్పంచ్ ను పరామర్శించిన మంత్రి పొంగులేటి   •   స్టేట్ 2వ ర్యాంక్ సాధించిన విద్యార్థినికి ఘన సత్కారం   •   ప్రముఖ గాయని ఆశా భోస్లే మృతి పట్ల లోక్‌సభ సంతాపం   •   డీలిమిటేషన్ పై దేశవ్యాప్తంగా ఉత్కంఠ   •   వడ్ల కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన సర్పంచ్   •   అదృశ్యమైన వ్యక్తి దారుణ హత్య.. పొలాల్లో లభ్యమైన బూడిద, అస్తికలు   •   ఆక్రమణలు తొలగించి అభివృద్ధికి సహకరించండి.   •  

దేశ భద్రతకు ప్రతి ఒక్కరూ బాధ్యతతో నడుచుకోవాలి

09-05-2025 02:17 AM

జిల్లా ఎస్పీ కె. నరసింహ

సూర్యాపేట, మే 8 (విజయక్రాంతి) : దేశ భద్రతకు ప్రతి ఒక్కరు బాధ్యతగా నడుచుకోవాలని జిల్లా ఎస్పీ కె.నరసింహ అన్నారు. సరిహద్దుల వెంట ఏర్పడిన ఉద్రిక్త పరిస్థితుల దృష్ట్యా పౌరుల రక్షణ, శాంతిభద్రతల ముందస్తు చర్యల్లో భాగంగా గురువారం జిల్లాలో ముమ్మర తనిఖీలు చేశారు.

ఈ సందర్భంగా జిల్లా కేంద్రంలో జిల్లా సెక్యూరిటీ సిబ్బంది డాగ్ స్క్వాడ్, బాంబ్ స్క్వాడ్ సిబ్బంది బస్టాండ్ లు, జాతీయ రహదారి, ఫ్లై ఓవర్లు, వ్యాపార సముదాయాలు, ముఖ్యమైన కూడళ్ల వద్ద హై సెక్యూరిటీ తనిఖీలు నిర్వహించారు.

అనంతరం ఎస్పీ మాట్లాడుతూ ప్రభుత్వ ఆదేశాల దృష్ట్యా జిల్లాలోని పోలీసులకు సెలవులు రద్దు చేసి 24 గంటలు విధుల్లో ఉండేలా ఆదేశాలు చేశామన్నారు. సరిహద్దుల్లో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల దృష్ట్యా పౌరులు దేశ భద్రతకు, ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా ఎవరు కూడా సోషల్ మీడియా నందు అనుచిత పోస్టింగులు, వ్యాఖ్యలు పెట్టొద్దన్నారు.

సున్నితమైన పరిస్థితులు దృష్టిలో ఉంచుకుని చట్టానికి లోబడి నడుచుకోవాలన్నారు. గుర్తింపు నిర్ధారణ లేని వ్యక్తులకు, అనుమానితులు లాడ్జ్ ల నందు వసతి ఇవ్వవద్దనీ సూచించారు.  ఈ తనిఖీలలో పలువురు పోలీస్ అధికారులు పాల్గొన్నారు