15 June, 2026 | 3:00 PM

Breaking News

తెలంగాణపై కేంద్రం తీవ్రమైన వివక్ష.. కిషన్ రెడ్డిపై రేవంత్ సంచలన వ్యాఖ్యలు   •   పెద్దపల్లిలో కాంగ్రెస్ బూత్ లెవెల్ ఏజెంట్ల శిక్షణ తరగతులు   •   తెలంగాణ ఏర్పాటును ఏనాడూ జనసేన వ్యతిరేకించలేదు   •   ప్రైవేటు పాఠశాలలపై చర్యలు తీసుకోవాలి   •   మొదటి రోజున నూతనంగా చేరిన విద్యార్థులకు ఘనస్వాగతం   •   ప్రభుత్వ విద్యపై భరోసా.. కొడుకును ప్రభుత్వ పాఠశాలలో చేర్పించిన మచ్చుపేట సర్పంచ్   •   కర్కోటక కాంగ్రెస్ ప్రభుత్వం.. బెల్లంపల్లిలో కవిత హల్‌చల్‌   •   తెలుగు ఫిల్మ్ ఛాంబర్ సబ్ కమిటీ సమావేశం   •   కార్మికుల దీక్షలకు స్థానిక ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ ప్రత్యక్ష మద్దతు ఇవ్వాలి   •   యోగ దినచర్యలో భాగం కావాలి: జిల్లా ప్రోగ్రాం అధికారి   •  

అభివృద్ధికి ప్రతి ఒక్కరూ సహకరించాలి

22-12-2025 12:57 AM

మోతె, డిసెంబర్ 21(విజయక్రాంతి): గ్రామ అభివృద్ధి చేయడం తన భాద్యత అని అందుకు గ్రామస్తులు అందరూ సహకరించాలని గోపతండ సర్పంచ్ భూక్య బిక్కు నాయక్ అన్నారు. ఆదివారం గోపతండలో ఆయన విలేకరులతో మాట్లాడారు. గ్రామంలో నెలకొన్న సమస్యలను పరిష్కరించడానికి శక్తివంచన లేకుండా కృషి చేస్తానన్నారు. నియోజకవర్గ ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి, రాష్ట్ర మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సహకారంతో గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దడమే తన లక్ష్యమన్నారు.

గ్రామంలో కోతుల బెడద నుంచి కాపాడలని వీధి దీపాలు ఏర్పాటు చేయడం మురుగు కాల్వలు నిర్మాణం చేయడం అర్హులైన పేదలందరికి ఇందిరమ్మ ఇండ్లు నిర్మాణం చేయించడం వ్యవసాయ భూములకు వెళ్లే రోడ్ల నిర్మాణం చేయడం గోపతండ నుంచి దుబ్బ నరసింహల గూడెం వరకు  రహదారి నిర్మాణం కోసం కృషి చేస్తానన్నారు.