15 June, 2026 | 2:01 PM

Breaking News

ప్రైవేటు పాఠశాలలపై చర్యలు తీసుకోవాలి   •   మొదటి రోజున నూతనంగా చేరిన విద్యార్థులకు ఘనస్వాగతం   •   ప్రభుత్వ విద్యపై భరోసా.. కొడుకును ప్రభుత్వ పాఠశాలలో చేర్పించిన మచ్చుపేట సర్పంచ్   •   కర్కోటక కాంగ్రెస్ ప్రభుత్వం.. బెల్లంపల్లిలో కవిత హల్‌చల్‌   •   తెలుగు ఫిల్మ్ ఛాంబర్ సబ్ కమిటీ సమావేశం   •   కార్మికుల దీక్షలకు స్థానిక ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ ప్రత్యక్ష మద్దతు ఇవ్వాలి   •   యోగ దినచర్యలో భాగం కావాలి: జిల్లా ప్రోగ్రాం అధికారి   •   మంత్రి శ్రీధర్ బాబు ఆదేశాల మేరకు ఫిషరీస్ భూమి సర్వే పూర్తి   •   ఆలయంలో గుప్తనిధుల వేట.. ప్రాచీన శివాలయం ధ్వంసం   •   భట్టి విక్రమార్కకు పుట్టినరోజు శుభాకాంక్షల వెల్లువ   •  

అయిజలో పత్తి మిల్లును పరిశీలించిన కవిత

22-12-2025 12:57 AM

ఆయిజ, డిసెంబర్ 21: జోగులాంబ గద్వాల జిల్లా అయిజలో పత్తి మిల్లును సందర్శించిన జాగృతి అధ్యక్షురాలు కవిత.జాగృతి జనం బాట కార్యక్రమంలో భాగంగా కవిత జోగులాంభ గద్వాల జిల్లాలోని తుమ్మిళ ఎత్తిపోతల పధకం మరియు అయిజ, పెద్దధన్వాడను స్సందర్శించారు.అందులో భాగంగా అయిజలోని పత్తి మిల్లును సందర్శించి రైతులను ఉద్ద్యేశించి మాట్లాడుతూ పత్తిరైతు గిట్టుబాటు ధరలు లేక గోసపడుతున్నారని ప్రభుత్వం రైతుల సమస్యను గాలికొదిలేసిందని అన్నారు.

పత్తి మిల్లు యజానులతో తప్పుడు తుకాలతో రైతులను మోసం చేస్తే ఊరుకోమని అన్నారు. పెద్దధన్వాడలో ఇథనాల్ కంపెనీ విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం రెండు నాలుకల వైఖరి కనపరుస్తుందని,జనం బాట కార్యక్రమంలో దారిపొడుగునా జనం నీటి సమస్యలపైనే మాట్లాడుతున్నారని అన్నారు.ఈ ప్రభుత్వానికి ఆరు నెలలు సమయమిస్తున్నాము తీరు మార్చుకోకపోతే ప్రభుత్వాన్ని ఎండగడుతూ పాదయాత్ర చేయాల్సి వస్తుందని అన్నారు.ఈకార్యక్రమంలో గొంగళ్ల రంజిత్ కుమార్ మరియు కార్యకర్తలు పాల్గొన్నారు.