17-08-2025 01:00:28 AM
-గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ
వికారాబాద్, ఆగస్టు-16: టీబీ వ్యాధి నివారణ కోసం ప్రతి ఒక్కరు బాధ్యత తీసుకో వాలని గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ పేర్కొన్నారు. టీబీ రాకుండా జాగ్రత్త పడాడని, వ్యాధి నివారణ కోసం చాలా రకాల మందులు వచ్చాయన్నారు. శనివారం ట్యూబర్ క్యూ లోసిస్ అసోసియేషన్ ఆఫ్ తెలంగాణ ఆధ్వర్యంలో వికారాబాద్ జిల్లా కేంద్రం సమీపం లోని అనంతగిరి హిల్స్ హరిత రిసార్ట్స్ లో ఏర్పాటు చేసిన మూడవ తెలంగాణ ట్యూబ ర్ క్యూలోసిస్, చెస్ట్ డిసిసెస్ కాన్ఫరెన్స్-2025 ప్రారంభోత్సవ కార్యక్రమంలో గవర్నర్ పాల్గొని మాట్లాడారు.
సబ్ కా వికాస్- సబ్ కా ప్రయాస్, టీబీ నిర్మూలనలో అందరు కష్ట పడితేనే అందరు ఆరోగ్యంగా ఉంటారన్నారు. రాష్ట్రానికి, దేశానికి అన్ని జిల్లాల కంటే వికారాబాద్ జిల్లాను రోల్ మాడల్ గా తీర్చి దిద్దాలని గవర్నర్ పేర్కొన్నారు.ఇందుకోసం ప్రత్యేక ప్రణాళిక రూపొందించా ల న్నారు. టీబీముక్త్ భరత్ కోసం ప్రతి ఒక్కరు బాధ్యతగా వ్యవహరించాలని, టీబీ నిర్మూలనలో జిల్లాను ఆదర్శంగా నిలపాలని గవర్నర్ తెలిపారు.
ఈ సందర్భంగా అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన టీబీ జిల్లా అధికారులు డాక్టర్ మల్లికార్జున ( మహబూబ్ నగర్) డాక్టర్ రాజు (జోగులాంబ గద్వాల్) , డాక్టర్ సుమలత (ఆదిలాబాద్) డాక్టర్ పుల్లారెడ్డికి ప్రశంసా పత్రాలు, గోల్డ్ మెడల్ అందజేశారు. కాగా గవర్నర్ జిష్ణుదేవ్ వర్మకు అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్కుమార్, చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్రెడ్డి, కలెక్టర్ ప్రతీక్ జైన్, ఎస్పీ నారాయణరెడ్డి పూలమొక్కలు అందజేసి స్వాగతం పలికారు. ఈ సందర్భంగా గవర్నర్ పోలీస్ గౌరవ వందనం స్వీకరించారు.