15 April, 2026 | 1:13 PM

Breaking News

మహిళలంటే రేవంత్ రెడ్డికి ఎందుకు వివక్ష?.. సీఎంకు ఎంపీ లక్ష్మణ్ కౌంటర్   •   ఎంపీ అశోక్ మిట్టల్‌ వ్యాపార సంస్థలపై ఈడీ దాడులు   •   బీహార్ రాజకీయాల్లో చారిత్రక ఘట్టం... సీఎంగా సామ్రాట్‌ చౌదరి   •   రేవంత్‌ రెడ్డితో పీసీసీ చీఫ్, మీనాక్షి నటరాజన్ భేటీ   •   తెలంగాణ పర్యాటక రంగాన్ని బలోపేతం చేస్తాం: మంత్రి జూపల్లి   •   ఛత్తీస్‌గఢ్‌లో భారీ పేలుడు: 14కు చేరిన మృతుల సంఖ్య.. న్యాయవిచారణకు కాంగ్రెస్ డిమాండ్   •   AP Inter Results 2026: ఏపీ ఇంటర్ ఫలితాలు విడుదల   •   పంజాబ్‌లో బస్సు బోల్తా: ఆరుగురు యాత్రికులు మృతి   •   దక్షిణాదిలో ప్రజాఉద్యమం తప్పదు.. కేంద్ర ప్రభుత్వానికి KTR హెచ్చరిక   •   సంక్షేమ- అభివృద్ధి సమన్వయమే ప్రభుత్వ ధ్యేయం: మంత్రి పొంగులేటి   •  

సీపీఆర్ పై ప్రతి ఒక్కరు అవగాహన కలిగి ఉండాలి..

19-11-2025 04:41 PM

బేల (విజయక్రాంతి): గుండెనొప్పి వచ్చినప్పుడు మనిషిని బ్రతికించేందుకు చేసే కార్డియోపల్మనరీ రిససిటేషన్(సీపీఆర్) పై ప్రతి ఒక్కరు అవగాహన కలిగి ఉండాలని బేల మండల మెడికల్ ఆఫీసర్ వంశీ కృష్ణ అన్నారు. జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు బేల పోలీస్ స్టేషన్ లో బుధవారం రోడ్డు భద్రతపై అవగాహన సదస్సును నిర్వహించారు. ఇందులో సీఐ శ్రవణ్ కుమార్ తో కలిసి ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీపీఆర్ పైన అవగాహన కల్పించారు. ఈ సందర్బంగా రోడ్డు భద్రతలో భాగంగా పలువురికి ప్రథమ చికిత్స బాక్స్ లను అందజేశారు.

ఈ సందర్బంగా సీఐ మాట్లాడుతూ ఇటీవల కాలంలో ఆకస్మిక గుండెపోటు వలన అనేక మంది వారి విలువైన ప్రాణాలు కొలపుతున్నారని, దీని నివారణకు సీపీఆర్ గురించి ప్రతి ఒక్కరికి తెలిసి ఉండాలని పేర్కొన్నారు. సీపీఆర్ వలన ఆకస్మిక గుండెపోటు నుంచి ప్రాణాలు కాపాడే ప్రయత్నం చేయవచ్చన్నారు. ప్రతి ఒక్కరు ఈ మెలకువలు తెలుసుకోవాలని సూచించారు. అదేవిధంగా రోడ్డు ప్రమాదానికి గురైనప్పుడు గాయపడ్డ వ్యక్తికి ప్రథమ చికిత్స అందించేదనిపై  వివరించారు.