17 April, 2026 | 2:32 PM

Breaking News

తేజస్వీ సూర్య వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన మాజీ ఎంపీ నామ   •   కాళేశ్వరంలో జరిగిన పొరపాట్లు.. తెలంగాణ ప్రజలకు తెలుసు   •   ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి తంగళ్ళపల్లిలో వినతి పత్రాల కార్యక్రమం   •   25 క్వింటాళ్ల రేషన్ బియ్యం సీజ్   •   హుజూర్ నగర్ సీనియర్ సివిల్ జడ్జిగా శ్యామ సుందర్   •   విద్యార్థిని మృతి... ప్రభుత్వంపై తెలంగాణ బీసీ సంక్షేమ సంఘంతీవ్ర విమర్శలు   •   మాణిక్ గూడ గ్రామ సంరక్షణకు చర్యలు   •   సేవ చేయాలనే సంకల్పంతోనే రాజకీయాల్లోకి   •   వేములవాడ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో సర్వర్ డౌన్.. నిలిచిపోయిన రిజిస్ట్రేషన్లు   •   శ్రీ భీమేశ్వర స్వామి సేవలో ఐజీపీ రమేష్ నాయుడు   •  

మాదకద్రవ్యాల నిరోధానికి ప్రతిఒక్కరు కృషి చేయాలి

19-11-2025 12:48 AM

కలెక్టర్ హనుమంతరావు 

యాదాద్రి భువనగిరి, నవంబర్ 18 (విజయక్రాంతి): మాదకద్రవ్యాల నిరోధక ప్రతిజ్ఞ నషాముక్త్ భారత్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా జిల్లా సంక్షేమ శాఖ ఆద్వర్యంలో మంగళవారం  జిల్లా కలెక్టరేట్  సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ హనుమంత రావు, రెవిన్యూ అదనపు కలెక్టర్ వీరా రెడ్డి, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ భాస్కర్ రావు సమక్షంలో అధికారులు, ఉద్యోగులు  అందరూ కలసి మాదకద్రవ్యాల నిరోధక సామూహిక ప్రతిజ్ఞ చేశారు.

ఈ సందర్భంగా కలెక్టర్  మాట్లాడుతూ డ్రగ్స్ రహిత జీవనశైలిని అనుసరిస్తూ ఏ ఒక్కరు కూడా డ్రగ్స్ బారిన పడకుండా ఉండడానికి ప్రతి ఒక్కరు కృషి చేయాలని మత్తు పదార్థాలకు దూరంగా ఉంటూ తమ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని  సూచించారు. గంజాయి తోపాటు ఇతర మత్తు పదార్థాలు అమ్మిన కొనుగోలు చేసిన అక్రమ రవాణా చేసిన ఆ వ్యక్తులకు సంబంధించిన సమాచారాన్ని అధికారులకు తెలియజేయాలని డ్రగ్స్ రహిత సమాజం కోసం ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని కోరారు.

అనంతరం నషా ముక్త్ భారత్ అభియాన్  పార్టిసిపేషన్ సర్టిఫికెట్ పోస్టర్ ను విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో చౌటుప్పల్ ఆర్డీవో శేఖర్ రెడ్డి, టీజేఏసీ చైర్మన్ మందడి ఉపేందర్ రెడ్డి, జిల్లా సంక్షేమ అధికారి నర్సింహారావు, వైద్య శాఖ అధికారి డా.మనోహర్, జిల్లా  పలు విభాగాల ఉద్యోగులు తదితరులు పాల్గొన్నారు.