28 June, 2026 | 12:22 PM

Breaking News

పోలియో రహిత సమాజ నిర్మాణం అందరి బాధ్యత   •   పసిపిల్లల ఆరోగ్యానికి ఆ రెండు చుక్కలే రక్ష   •   సీసీ కెమెరాలతో గ్రామంలో పటిష్టమైన భద్రత   •   రోజువారి కూలీల జేబుకు చిల్లు పెడుతున్న మద్యం మాఫియా   •   రేవంత్ రెడ్డి నల్లగొండ సభ వేళ బీఆర్ఎస్ నాయకుల అరెస్ట్   •   ప్రతి చిన్నారికి పోలియో చుక్కలు వేయించాలి   •   రాష్ట్రవ్యాప్తంగా పల్స్ పోలియో కార్యక్రమం   •   పీవీ నరసింహారావు జయంతి సందర్భంగా నివాళులర్పించిన సీఎం రేవంత్ రెడ్డి   •   పి.వి. నరసింహారావుకి నివాళులర్పించిన కిషన్ రెడ్డి, బండారు దత్తాత్రేయ   •   ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఎస్ఐఆర్ ప్రక్రియను సక్రమంగా నిర్వహించాలి   •  

కృత్రిమ మేధస్సు ఉపయోగం అంశంపై నిపుణుల చర్చ

06-12-2025 12:00 AM

ఘట్ కేసర్, డిసెంబర్ 5 (విజయక్రాంతి): వెంకటాపూర్ అనురాగ్ విశ్వవిద్యాలయం నందు  వి.ఎల్.ఎస్.ఐ. నందు ఈసీఈ విభాగం  వి.ఎల్.ఎస్.ఐ క్లబ్, ఐఈఈఈ స్టూడెంట్ బ్రాంచ్ ఆధ్వర్యంలో  వి.ఎల్.ఎస్.ఐ రంగంలో కృత్రిమ మేధస్సు ఉపయోగం అనే అంశంపై శుక్రవారం నిపుణుల చర్చ కార్యక్రమం  నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని ఈసీఈ విభాగాధిపతి డాక్టర్ హరికృష్ణ కమతం ప్రారంభించారు.

ఈకార్యక్రమానికి అమెరికా  నుండి ఎన్విడియా పరిశ్రమ నందు సీనియర్ హార్డ్ వేర్ ఇంజనీర్ గా పనిచేస్తున్న  శ్రీధర్ గుడల, ముఖ్యఅతిథిగా పాల్గొని ఈసిఈ విద్యార్థులకు  వి.ఎల్.ఎస్.ఐ నందు కృత్రిమ మేధస్సు ఉపయోగం, భవిష్యత్తు నందు కృత్రిమ మేధస్సును ఉపయోగించుకుని అభివృద్ధి చెందుతున్న వి.ఎల్.ఎస్.ఐ ఉత్పాదనలు గురించి అవగాహన కల్పించారు.

ఈ కార్యక్రమం నందు ఈసీఈ విభాగాధిపతి డాక్టర్ హరికృష్ణ కమతం, డాక్టర్ ఎం. సంతోష్ అసోసియేట్ డైరెక్టర్ ఓ.ఐ.ఏ, డా.పి. రామకృష్ణ, డాక్టర్ ఎస్. అమృత, విద్యార్థి సమన్వయకర్తలు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.