13 July, 2026 | 9:36 PM

Breaking News

నులిపురుగుల నివారణ మాత్రలు తప్పక వేయించాలి   •   వైటీసీ ద్వారా నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించాలి   •   జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవ సందర్బంగా ఆల్బండజోలు మాత్రలు పంపిణి   •   పదోన్నతిపై బదిలీ అయిన పోస్టల్ ఉద్యోగులకు ఘనంగా సన్మానం   •   విద్యార్థినీల పట్ల నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవు   •   ప్రజావాణి దరఖాస్తులు క్షేత్రస్థాయిలోకి వెళ్లి పరిష్కరించాలి   •   లక్క పురుగుతో ఇబ్బందులు పడుతుంటే అధికారులు నిద్రపోతున్నారా..?   •   వైటీపీఎస్ టెండర్లను రద్దు చేయాలి   •   రహదారి నిర్మాణం చేప‌ట్టాల‌ని వినతి   •   సర్ పత్రాల సేకరణను పరిశీలించిన మాజీ మున్సిపల్ చైర్మన్ జంగం గంగాధర్   •  

అసత్య ఆరోపణలు మంచిది కాదు

13-01-2026 01:41 AM

ఐఏఎస్‌లపై మీడియా కథనాలు

  1. జిల్లాల పునర్విభజనపై ప్రస్తుతం ఎలాంటి చర్యలు లేవు
  2. మంథని పట్టణ అభివృద్ధికి కృషి చేస్తా
  3. ఐటీ శాఖ మంత్రి శ్రీధర్‌బాబు

మంథని, జనవరి 12 (విజయక్రాంతి): రాష్ట్రంలో ప్రభుత్వ పెద్దలు, ఐఏఎస్ అధికారులపై మీడియా, సోషల్ మీడియాలో వచ్చిన కథనాలను ఖండిస్తున్నట్లు ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు తెలిపారు. సోమవారం మంథని పట్టణం లో ఆయన మాట్లాడారు. రాష్ట్ర అభివృద్ధి కోసం కృషి చేస్తున్న ఐఏఎస్ అధికారులు, ప్రభుత్వ పెద్దలపై అసత్య ఆరోపణలు సరికాదన్నారు. అదేవిధంగా జిల్లాల పునర్విభజనపై ప్రస్తుతం ఎలాంటి చర్యలు లేవని మంత్రి స్పష్టం చేశారు. మంథని పట్టణ అభివృద్ధికి కృషి చేస్తామని, కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సహకారంతో పట్టణ అభివృద్ధికి పాటుపడతామని హామీ ఇచ్చారు.