13 July, 2026 | 9:37 PM

Breaking News

నులిపురుగుల నివారణ మాత్రలు తప్పక వేయించాలి   •   వైటీసీ ద్వారా నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించాలి   •   జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవ సందర్బంగా ఆల్బండజోలు మాత్రలు పంపిణి   •   పదోన్నతిపై బదిలీ అయిన పోస్టల్ ఉద్యోగులకు ఘనంగా సన్మానం   •   విద్యార్థినీల పట్ల నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవు   •   ప్రజావాణి దరఖాస్తులు క్షేత్రస్థాయిలోకి వెళ్లి పరిష్కరించాలి   •   లక్క పురుగుతో ఇబ్బందులు పడుతుంటే అధికారులు నిద్రపోతున్నారా..?   •   వైటీపీఎస్ టెండర్లను రద్దు చేయాలి   •   రహదారి నిర్మాణం చేప‌ట్టాల‌ని వినతి   •   సర్ పత్రాల సేకరణను పరిశీలించిన మాజీ మున్సిపల్ చైర్మన్ జంగం గంగాధర్   •  

ఉద్యోగులకు డీఏ 3.64% పెంపు

13-01-2026 01:39 AM

సంబురాల సంక్రాంతి

  1.   2023 జులై 1 నుంచి అమలు 
  2. జీపీఎఫ్ ఖాతాలో జమచేయనున్న సర్కార్ 
  3. ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం

హైదరాబాద్, జనవరి 12 (విజయక్రాంతి) : సంక్రాంతి పండుగ పూట ఉద్యోగులకు తెలంగాణ ప్రభుత్వం డీఏ (కరువు భత్యం)  పెంచుతూ  శుభవార్త చెప్పింది. డీఏను 3.64 శాతం పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు ఆర్థికశాఖ ముఖ్యకార్యదర్శి సందీప్‌కుమార్ సుల్తానియా సోమవారం జీవో నెంబ ర్ 2ను విడుదల చేశారు. 2023 జులై 1వ తేదీ నుంచి అమలు కానుంది. ఈ  జనవరి వేతనంతో కలిపి ప్రభుత్వం డీఏ చెల్లించనుంది. జిల్లా , మండల పరిషత్, గ్రామ పంచాయతీలు, మున్సిపాలిటీ, వ్యవసాయ, మార్కెంట్ కమిటీ  యూనివర్సిటీ టీచింగ్, నాన్ టీచింగ్ తదితర ఉద్యోగులకు కూడా ఈ డీఏ వర్తించనుంది.

జులై 2023 నుంచి డిసెంబర్ 2025 వరకు ఉన్న బకాయిలన్నింటిని ప్రభుత్వం చెల్లించనుంది. బకాయిలను జీపీఎఫ్ ఖాతాల్లో జమ చేయనుంది. రీటైర్ అయ్యే ఉద్యోగులకు 30 విడతల్లో బకాయిలు చెల్లించనుంది. పార్ట్‌టైమ్ అసిస్టెంట్లు, వీఆర్‌ఏలకు నెలకు రూ. 100 అదనంగా చెల్లించనుంది. అంతకుముందే సీఎం రేవంత్‌రెడ్డి డీఏ ఫైల్‌పై సంతకం చేసినట్లు గెజిటెడ్ ఆఫీసర్ డైరీ ఆవిష్కరణలో ప్రకటించారు.