16-08-2025 12:10:41 AM
నాగర్కర్నూల్ (విజయక్రాంతి): నాగర్కర్నూల్ జిల్లా లింగాల మండల కేంద్రానికి చెందిన మూడవత్ పెంట్యనాయక్(65) పొలానికి వెళ్లి తిరిగిరాలేదు. కుటుంబ సభ్యులు స్థానికంగా ఎంత వెతికినా ఎక్కడ ఆచూకీ లభించలేదు. శుక్రవారం పొలానికి వెళ్లే దారిలో ఉన్న కాలువలో శవమై తేలాడు. పెంట్య నాయక్కు భార్య లక్ష్మి, ఇద్దరు కుమారులు ఉన్నారు.