10 May, 2026 | 8:49 PM

Breaking News

సింగిరెడ్డిపల్లి యువకుని దారుణ హత్య   •   అక్రమ పశువుల రవాణాపైన సరిహద్దు చెక్ పోస్టులో పటిష్ట నిఘా   •   మోడీ సభకు తరలి వెళ్లిన నాగిరెడ్డిపేట బిజెపి నాయకులు   •   మహిళా కాంగ్రెస్ ఆధ్వర్యంలో కేంద్ర సహాయ మంత్రి దిష్టిబొమ్మ దగ్ధం   •   125 వారాలు పూర్తి అయిన హనుమాన్ చాలీసా పారాయణం   •   బండి భగీరథను వెంటనే కాంగ్రెస్ ప్రభుత్వం అరెస్ట్ చేయాలి   •   మద్నూర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షునికి నాయకుల ఘన సన్మానం   •   కామారెడ్డి రక్తదాతల సమూహం, ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ కు అవార్డుల పంట   •   అమ్మవారి ఆలయంలో కమిషనర్ పూజలు   •   కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులుగా ఎన్నికైన బజ్జూరి వెంకటరెడ్డి   •  

ఆదివాసీ గూడల్లో కొమురం భీం విగ్రహాల ఏర్పాటు..

09-09-2025 07:13 PM

మాజీ ఎంపీపీ తుల శ్రీనివాస్...

బోథ్ (విజయక్రాంతి): సోనాల మండలంలోని ఆదివాసీ గూడ లైన మహదు గూడ, కేశవ్ గూడ, పార్డి (బి), పార్డి (కే), ఘన్పూర్, టివిటి, పరుపుల పల్లెలో తుల శ్రీనివాస్ వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో ఆదివాసీ పోరాట యోధుడు కొమరం భీం విగ్రహాలను ఏర్పాటు చేయనున్నట్లు మాజీ ఎంపీపీ, సొసైటీ చైర్మన్ తుల శ్రీనివాస్(Former MPP Tula Srinivas) వెల్లడించారు. ఈ మేరకు మంగళవారం కొమురం భీం విగ్రహాల ఏర్పాటు కోసం ఆయన భూమి పూజ చేశారు. ఈ సందర్బంగా తుల శ్రీనివాస్ మాట్లాడుతూ... కొమురం భీం ఆశయాలను ఆదివాసి గ్రామాలకు తెలియజేయాలనే ఉద్దేశంతో కొమురం భీం విగ్రహాల ఏర్పాటుకు  సంకల్పించామన్నారు. కొమురం భీం ఒక వ్యక్తి కాదు శక్తి అని ఆయన ఎందరికో స్ఫూర్తి నిచ్చారని కొనియాయాడారు. ఈ కార్యక్రమంలో సోనాల మండలం పార్డి (బి) రాయి సెంటర్ సర్మేడీ తొడసం లక్ష్మణ్, ఐటిడిఎ మాజీ డైరెక్టర్ మెష్రం భూమన్న, సర్పంచుల సంఘం అధ్యక్షుడు శ్రీధర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.