10 May, 2026 | 11:08 PM

Breaking News

సింగిరెడ్డిపల్లి యువకుని దారుణ హత్య   •   అక్రమ పశువుల రవాణాపైన సరిహద్దు చెక్ పోస్టులో పటిష్ట నిఘా   •   మోడీ సభకు తరలి వెళ్లిన నాగిరెడ్డిపేట బిజెపి నాయకులు   •   మహిళా కాంగ్రెస్ ఆధ్వర్యంలో కేంద్ర సహాయ మంత్రి దిష్టిబొమ్మ దగ్ధం   •   125 వారాలు పూర్తి అయిన హనుమాన్ చాలీసా పారాయణం   •   బండి భగీరథను వెంటనే కాంగ్రెస్ ప్రభుత్వం అరెస్ట్ చేయాలి   •   మద్నూర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షునికి నాయకుల ఘన సన్మానం   •   కామారెడ్డి రక్తదాతల సమూహం, ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ కు అవార్డుల పంట   •   అమ్మవారి ఆలయంలో కమిషనర్ పూజలు   •   కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులుగా ఎన్నికైన బజ్జూరి వెంకటరెడ్డి   •  

ఉద్యమమే ఊపిరిగా జీవించిన ప్రజాకవి కాళోజీ నారాయణరావు..

09-09-2025 07:20 PM

వనపర్తి (విజయక్రాంతి): ఉద్యమమే ఊపిరిగా జీవించిన ప్రజాకవి కాళోజీ నారాయణరావు ప్రతి ఒక్కరికీ స్ఫూర్తి ప్రదాత అని జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి(District Collector Adarsh ​​Surabhi) అన్నారు. బి.సి. సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో మంగళవారం ఉదయం కలెక్టరేట్ కార్యాలయంలో కాళోజీ నారాయణరావు 111వ జయంతి వేడుకలను నిర్వహించగా జిల్లా కలెక్టర్, అదనపు కలెక్టర్  కాళోజీ చిత్ర పటానికి పూల మాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ సమాజంలో అన్యాయాన్ని ఎదిరించడం, ప్రశ్నించడమే కాళోజీ  నారాణరావుకు నిజమైన నివాళులు అని చెప్పారు. నిజాం నవాబు నిరంకుశానికి వ్యతిరేకంగా సామాన్య మానవునికి సైతం అర్థం అయ్యే రీతిలో ఎన్నో కవిత్వాలు రాసి ప్రజల్లో చైతన్యం నింపిన వ్యక్తి అని కొనియాడారు.

ఒక్క సిరా చుక్క..వేయి మెదళ్లకు కలయిక అనే స్ఫూర్తితో... తెలంగాణ ప్రజలను జాగృతం చేయడంలో ఆయన కీలక  పాత్ర పోషించారన్నారు. కవిగా ఉంటూ ఎన్నో రచనలు రాస్తూ తెలంగాణ ప్రజలను జాగృతం చేశారని గుర్తుచేసారు.  కాళోజీ నారాయణరావు నిరాడంబరుడు అని కొనియాడారు.  అదనపు కలెక్టర్ స్థానిక సంస్థలు యాదయ్య, జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ అధికారి ముజాహిద్ ఖాన్, జిల్లా వైద్య ఆరోగ్య అధికారి డాక్టర్ శ్రీనివాసులు, ప్రజా సంఘాల నాయకులు గంధం నాగరాజు, కలెక్టరేట్ సిబ్బంది తదితరులు నివాళులు అర్పించిన వాటిలో ఉన్నారు.