12 March, 2026 | 9:57 PM

Breaking News

రేమిడిచర్ల గ్రామంలో ప్రజల పాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమం   •   పశువులకు గాలి కుంట వ్యాధి నివారణ టీకాలు   •   మెడిపల్లి జడ్పీహెచ్ఎస్ లో ఘనంగా ఎస్సెస్సీ విద్యార్థుల వీడ్కోలు కార్యక్రమం   •   దాసోహం బ్రదర్స్ ను పరామర్శించిన స్వర్ణకార సంఘం నాయకులు   •   టియుసిఐ రాష్ట్ర రాజకీయాల శిక్షణ తరగతులను జయప్రదం చేయండి   •   పశువులకు ఉచిత గాలికుంటు వ్యాధి నివారణ టీకాలు వేయించాలి   •   అన్ని దానాలకన్న అన్నదానం మిన్న   •   డ్రగ్స్‌పై దండయాత్ర.. మార్గదర్శి స్కూల్ విద్యార్థుల అవగాహన ర్యాలీ   •   వాటర్ ప్లాంట్ లో నూతన మిషనరీ ఏర్పాటు   •   ప్రపంచం ఇలాంటి చమురు సంక్షోభం ఎన్నడూ చూడలే   •  

చీరల పంపిణీని సమాఖ్య సభ్యులు పర్యవేక్షించాలి

20-11-2025 12:00 AM

జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి

కరీంనగర్, నవంబరు 19 (విజయ క్రాంతి): ఇందిరమ్మ చీరల పంపిణీ కార్యక్రమంలో భాగంగా అర్హులందరికీ చీరలు అం దేలా మహిళా సంఘాల సమాఖ్య అధ్యక్ష కార్యదర్శులు పర్యవేక్షించాలని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి తెలిపారు. ముఖ్యమంత్రి వీడియో కాన్ఫరెన్స్ అనంతరం జిల్లా, మం డల మహిళా సమాఖ్య అధ్యక్ష కార్యదర్శులతో కలెక్టర్ సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ మహిళలకు ప్రభుత్వం అందిస్తున్న చీరలు ప్రతి ఒక్కరికి చేరేలా సమాఖ్య అధ్యక్ష కార్యదర్శు లు పర్యవేక్షించాలని అన్నారు. ఓపెన్ స్కూ ల్, వయోజనుల విద్య నమోదులో జిల్లా లక్ష్యాన్ని పూర్తి చేసిందని తెలిపారు. స్వయం సహాయక సంఘాల సభ్యులు ఎక్కువ సంఖ్యలో ఓపెన్ 10వ తరగతి, ఇంటర్లో నమోదు చేసుకున్నారని తెలిపారు.

వీరంతా తరగతులకు కూడా హాజరు కావాలని సూ చించారు. ఇందిరా మహిళా శక్తి పథకం ద్వా రా మంజూరైన వివిధ యూనిట్లతో వ్యాపారాలు ప్రారంభించిన మహిళా సంఘాలు కృషి పట్టుదలతో అవకాశాన్ని సద్వినియో గం చేసుకొని లాభాలు గడించాలని తెలిపారు. ఈ సమావేశంలో అడిషనల్ కలెక్టర్ అశ్విని తానాజీ వాకడే, మున్సిపల్ కమిషనర్ ప్రపుల్ దేశాయ్, డిఆర్‌ఓ వెంకటేశ్వర్లు, ఆర్డీవో మహేశ్వర్, జిల్లా అధికారులు, కార్యదర్శులుపాల్గొన్నారు.