05-07-2025 12:27:58 AM
ఘట్ కేసర్, జూలై 4 : నీలిమా ఇన్ స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్, అనురాగ్ విశ్వవిద్యాల యం ఇటీవల నిర్వహించిన మాదకద్రవ్య వ్యతిరేక అవగాహన ప్రచారంలో అత్యుత్తమంగా పాల్గొన్న వారికి బహుమతి పంపిణీ కార్యక్రమాన్ని శుక్రవారం నిర్వహించింది. మాదకద్రవ్య దుర్వినియోగ ప్రమాదాల గురించి అవగాహన కల్పించడంలో అసాధారణ నిబద్ధతను చూపిన వ్యక్తులు మరియు సమూహాల ప్రయత్నాలను గుర్తించడం, గౌరవించడం.
ఈకార్యక్రమం లక్ష్యం. కమ్యూనిటీ మెడిసిన్ విభాగం అనురాగ్ విశ్వవిద్యాలయంలోని ఎన్ఎస్ఎస్ యూనిట్ సహకారంతో సెకండియర్ ఎంబీబీఎస్ విద్యార్థులతో ఈకార్యక్రమాన్ని నిర్వహించింది. ఉత్తమ పోస్టర్, ఉత్తమ నినాదం, ఉత్తమ లఘు చిత్రం సహా వివిధ విభాగాలలో విజేతలకు సంస్థ గౌరవనీయ డీన్ డాక్టర్ లక్ష్మీ ప్రసన్న, కమ్యూనిటీ మెడిసిన్ విభాగం అధిపతి డాక్టర్ పి. శ్రుతి, అనురాగ్ విశ్వవిద్యాలయం యొక్క ఎన్ఎస్ఎస్ సమన్వయకర్త డాక్టర్ మల్లేష్ బహుమతులు ప్రధానం చేశారు.