14-09-2025 10:11:55 PM
మణుగూరు,(విజయక్రాంతి): స్థానిక మురళీ మాన్ పవర్ ఏజెన్సీలో సెక్యూరిటీ గార్డ్స్ గా విధులు నిర్వహిస్తు మేదర బస్తిలో నివాసముంటున్న దొనికే ప్రేమ్ కుమార్, శ్రీనివాస్, ల తండ్రి రాజమౌళి గత కొన్ని రోజుల క్రితం మృతి చెందారు. కాగా కష్టాల్లో ఉన్న కుటుంబాన్ని ఆడుకునేందుకు తోటి సింగరేణి ప్రైవేట్ సెక్యూరిటీ గార్డ్స్ అందరూ కలిసి ముందుకు కదిలారు. రూ.32,600 రూపాయల ఆర్థిక సహాయాన్ని అన్నదమ్ము లకు అందజేశారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ. ప్రతి ఒక్క కుటుంబానికి, ఏ ఒక్కరికి ఆపద వచ్చిన మేమున్నాము అంటూ భరోసా కల్పిస్తూ ముందుండి వారికి మనో ధైర్యాన్ని కల్పిస్తూ. ఒకే కుటుంబం లాగా కలిసి మెలిసి ఉంటామని తెలిపారు.