14 April, 2026 | 9:02 PM

ఢిల్లీ పబ్లిక్ స్కూల్ బస్సులో మంటలు

22-10-2025 05:02 PM

హైదరాబాద్: మైలార్‌దేవ్‌పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని లక్ష్మీగూడ వాంబే కాలనీ సమీపంలో బుధవారం ఢిల్లీ పబ్లిక్ స్కూల్ బస్సుకు అకస్మాత్తుగా మంటలు అటుకున్నాయి. బస్సు నాదర్‌గుల్‌కు వెళుతుండగా ఇంజిన్ కంపార్ట్‌మెంట్ నుండి పొగలు రావడంతో డ్రైవర్ హరి ప్రసాద్ వెంటనే అప్రమత్తమై వాహనాన్ని త్వరగా రోడ్డు పక్కన ఆపి అందరి భద్రతను నిర్ధారించాడు. క్షణాల్లోనే మంటలు బస్సును పూర్తిగా చుట్టుముట్టాయి. అదృష్టవశాత్తూ సంఘటన జరిగిన సమయంలో బస్సులో విద్యార్థులు ఎవరూ లేకపోవడంతో పెద్ద విషాదం తప్పింది. 

స్థానికుల సమాచారంతో పోలీసులు, చంద్రాయణగుట్ట అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపు చేశారు. ఇంజిన్ పనిచేయకపోవడం వల్లే మంటలు చెలరేగి ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. ప్రమాదానికి గల కారణాన్ని తెలుసుకోవడానికి దర్యాప్తు ప్రారంభించారు. ప్రమాదం జరగకుండా నిరోధించడంలో డ్రైవర్ తీసుకున్న సత్వర చర్యను విస్తృతంగా ప్రశంసించారు.