13-12-2025 06:49:08 PM
నిర్మల్,(విజయక్రాంతి): మొదటి విడతగా జరిగిన ఎన్నికల్లో గెలుపొందిన సర్పంచులు శనివారం రాష్ట్ర మాజీ మంత్రి ఏ ఇంద్రకరణ్ రెడ్డి ని కలిసి పుష్పగుచ్చం అందించారు. లక్ష్మణ చందా మామడ కడెం ఖానాపూర్ ప్రాంతాల్లో కాంగ్రెస్ పార్టీ మద్దతు తో గెలుపొందిన సర్పంచులు మంత్రిని మర్యాదపూర్వకంగా కలుసుకొని సన్మానం చేశారు గెలుపొందిన సర్పంచులకు ఇంద్రకరణ్ రెడ్డి శాలువాతో సత్కరించి ప్రజలకు సేవ చేయాలని సూచించారు