19-04-2025 09:48:17 PM
మహబూబాబాద్ (విజయక్రాంతి): మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ మున్సిపల్ మాజీ కౌన్సిలర్ జరుపుల వీరన్న ఇటీవల అనారోగ్యంతో మరణించగా శనివారం ఆయన కుటుంబాన్ని మాజీ ఎమ్మెల్సీ సత్యవతి రాథోడ్ పరామర్శించి 25వేల రూపాయలను సహాయంగా అందజేశారు. సత్యవతి రాథోడ్ వీరన్న దశదినకర్మ సందర్భంగా చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించి కుటుంబ సభ్యులను ఓదార్చారు. వీరన్న మరణం తీరనిలోటు అని పేర్కొన్నారు.