15 June, 2026 | 7:00 PM

Breaking News

పాఠశాలలు, వసతి గృహాలు, ఆరోగ్య కేంద్రాల్లో పరిశుభ్రత, నాణ్యమైన సేవలపై ప్రత్యేక దృష్టి సారించాలి   •   గిడ్డంగుల్లో ధాన్యం నిల్వతో అధిక లాభాలు   •   రేషన్ షాపుల ద్వారా ఉచితంగా 14 రకాల నిత్యవసర సరుకులు అందించాలి   •   ప్రైవేటు భూములను రిజిస్ట్రేషన్ నిషేధిత జాబితా(22-ఏ)నుండి విముక్తి కల్పించండి   •   కోర్ట్ కు సిమెంట్ బెంచీల వితరణ   •   ప్రభుత్వ బడులను మూసివేసే కుట్ర, ముఖ్యమంత్రి మానుకోవాలి.   •   అన్ని దానాలకన్న అన్నదానం మిన్న   •   కీతవారిగూడెంలో ఉపాధి హామీ పథకానికి తూట్లు   •   ఉపముఖ్యమంత్రిని కలిసిన అరెపల్లి   •   దోమకొండ కెనరా బ్యాంకులో సైబర్ మోసాలపై అవగాహన   •  

కురవి సర్పంచ్ లక్ష్మిని సన్మానించిన మాజీ ఎంపీ కవిత

19-12-2025 12:00 AM

మహబూబాబాద్, డిసెంబర్ 18 విజయక్రాంతి: మహబూబాబాద్ జిల్లా కురవి మేజర్ పంచాయతీ సర్పంచ్ గా ఎన్నికైన బాదావత్ లక్ష్మీరాజు నాయక్ దంపతులను, వార్డు సభ్యులను గురువారం మహబూబాబాద్ జిల్లా బీఆర్‌ఎస్ అధ్యక్షురాలు, మాజీ ఎంపీ మాలోత్ కవిత సత్కరించారు. ప్రజల ఆశయా ల మేరకు గ్రామ అభివృద్ధికి కృషి చేయాలని,

అలా గే కురవి శ్రీ భద్రకాళి సమేత వీరభద్ర స్వామి దేవాలయ అభివృద్ధి, భక్తులకు సౌకర్యాల కల్పన కోసం పాటుపడాలని కవిత కోరారు. అధికార కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిపై సమిష్టి కృషితో విజయం సాధించడం పట్ల పార్టీ నాయకులను అభినందించారు. ఈ కార్యక్రమంలో బిఆర్‌ఎస్ నాయకులు కొనతం విజయ్, నరసింహారావు, భరత్ వర్మ, మల్లికార్జున్, శ్రీను, వినోద్, రవి, వీరన్న, ప్రశాంత్, కళ్యాణ్ పాల్గొన్నారు.