27 April, 2026 | 11:52 AM

Breaking News

న్యాయం జరుగుతుందన్న నమ్మకం లేదు: కేజ్రీవాల్ సంచలన నిర్ణయం   •   హైవేపై ఘోర రోడ్డు ప్రమాదం: ఐదుగురు మృతి   •   హైదరాబాద్లో పెట్రోల్, డీజిల్ కొరత.. ​ఎక్కడ చూసిన నో స్టాక్ బోర్డులు   •   నార్కెట్‌పల్లిలో రోడ్డు ప్రమాదం: సాఫ్ట్‌వేర్ మృతి   •   ప్రతి కుటుంబం ఖచ్చితంగా వివరాలు నమోదు చేసుకోవాలి: భట్టి విక్రమార్క   •   బీఆర్ఎస్ రాజకీయ పార్టీ కాదు.. ఒక విప్లవం!   •   శ్రీవారి సేవలో తెలంగాణ బీజేపీ చీఫ్ రామచందర్ రావు   •   దమ్మాయిగూడెం వద్ద రెండు లారీలు ఢీ   •   నిరుపేద చిన్నారి ప్రాణాల కోసం పోరాటం – దాతల సాయం కోసం తల్లిదండ్రుల విజ్ఞప్తి   •   బంకులు బంద్.. ప్రజలు పరేషాన్   •  

మాజీ ఎంపీ మధుయాష్కీ గౌడ్ కు అస్వస్థత

16-09-2025 05:57 PM

హైదరాబాద్: కాంగ్రెస్ నేత, మాజీ ఎంపీ మధుయాష్కీ గౌడ్(Congress leader Madhu Yashki Goud) మంగళవారం అస్వస్థతకు గురైయ్యారు. సచివాలయంలో మంత్రి శ్రీధర్ బాబు అధ్యక్షతన జరుగుతున్న సమావేశంలో ఛాతినొప్పి అంటూ ఒక్కసారిగా మధుయాష్కి గౌడ్ కూలబడిపోయారు. గమనించిన అధికారులు వెంటనే సచివాలయంలోని డిస్పెన్సరీలో తక్షణ వైద్యం అందించారు. అనంతరం మెరుగైన చికిత్స కోసం మధుయాష్కి గౌడ్ ని గచ్చిబౌలిలోని ఏఐజీ ఆసుపత్రికి తరలించారు. అస్వస్థత విషయం తెలుసుకున్న మధుయాష్కీ గౌడ్ అనుచరులు, సన్నిహితులు, కాంగ్రెస్ నాయకులు పెద్ద సంఖ్యలో ఏఐజీ ఆసుపత్రికి తరలివస్తున్నారు. మధుయాష్కీ గౌడ్ ఆరోగ్య పరిస్థితి గురించి ఆరా తీస్తున్నారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్లు తెలుస్తొంది.